News April 23, 2025
సివిల్ సర్వీసెస్లో వంగూరు వాసి సత్తా

వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లికి చెందిన గోకమోళ్ల ఆంజనేయులు మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫైనల్ ఫలితాల్లో 934 ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు కష్టపడి చదివి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ర్యాంకు సాధించడం పట్ల తిప్పారెడ్డిపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆంజనేయులు గ్రామంలోని యువతకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
Similar News
News April 23, 2025
HNK: ఇంటర్ ఫలితాల్లో ‘వేలేరు గురుకులం’ విజయదుందిబి!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో HNK జిల్లా వేలేరు గురుకుల కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి విజయదుందుబి మోగించారు. ఎంపీసీలో నందకిషోర్ 986/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. బైపీసీలో రాహుల్కు 980/1000 మార్కులు లభించాయి. ఎంపీసీలో సాయి గణేశ్ 464/470 మార్కులు, బైపీసీలో శశాంత్ 420/440 మార్కులు సాధించారు. విద్యార్థులను, స్టాఫ్ను ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ కుమార్ అభినందించారు.
News April 23, 2025
ఉమ్మడి ప.గో జిల్లాలో 10Th ఉత్తీర్ణత శాతం ఇలా..

10వ తరగతి ఫలితాల్లో ఉమ్మడి ప.గో. జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాదితో పోల్చితే ఈసారి ప.గో.జిల్లా మెరుగుపడగా ఏలూరు జిల్లా కాస్త తగ్గింది. ➤ ప.గో.జిల్లాలో గతేడాది 81.82% ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 82.15% శాతంతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. ➤ ఏలూరు జిల్లా విద్యార్థులు గతేడాది 80.08% శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. ఈ ఏడాది 77.24% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
సర్కార్ బడిలో మెరిసిన ఆణిముత్యం

తాజాగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో పల్నాడు జిల్లా విద్యార్థిని అద్భుతంగా రాణించారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల జడ్పీ పాఠశాల విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదవి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన విద్యార్థినిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ లలిత, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.