News April 23, 2025

HYD: BRS సభకు లగచర్ల బాధితుల విరాళం

image

లగచర్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం నంది నగర్‌లోని తన నివాసం వద్ద కేటీఆర్‌ని లగచర్ల బాధితులు కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. దీనికి సంబంధించి చెక్కును కేటీఆర్‌కు ఇచ్చారు. విరాళం అందించిన వారందరినీ కేటీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభను చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Similar News

News April 23, 2025

HYD: యూనిట్లకు బిల్లు ఎలా నిర్ధారిస్తారంటే!

image

గ్రేటర్ HYDలో వేసవి వేళ కొందరికి కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండగా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల వివరాలను హబ్సిగూడ అధికారులు తెలిపారు. జీరో నుంచి 50 యూనిట్లకు రూ.1.95, 50 నుంచి 100 యూనిట్లకు రూ.3.10, 101-200 యూనిట్లకు రూ.4.80, 201-300 యూనిట్లకు రూ.7.70 చొప్పున ఒక్కో యూనిట్‌పై ఇలా విద్యుత్ ఛార్జీ ఉంటుందని, లిమిట్ దాటితే యూనిట్ ఛార్జీ మారుతుందని తెలిపారు.

News April 23, 2025

HYD: గురుకుల విద్యార్థికి స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్

image

మైనార్టీ గురుకులానికి చెందిన ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థి ఎండీ. ఫర్హాన్‌కు CEC విభాగంలో స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ ల‌భించింది. TMRJC ఖైర‌తాబాద్‌కు చెందిన ఫర్హాన్‌కు 500 మార్కుల‌కు గాను 495 మార్కులు వ‌చ్చాయి. ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల ప్రోత్సాహం కారణంగా ఈ ర్యాంక్ వచ్చినట్టు ఫర్హాన్ తెలిపారు. దీంతో విద్యార్థికి కళాశాల అధ్యాపకులు, తోటి మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

News April 23, 2025

HYDలో నేడు ఎన్నికలు.. BJP VS MIM

image

GHMC హెడ్ ఆఫీస్‌లో నేడు స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. MIM నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, BJP నుంచి గౌతంరావు బరిలో ఉన్నారు. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. 22 ఏళ్ల తర్వాత ఈ ఎన్నిక జరగడం, INC, BRS పోటీ చేయకపోవడంతో గ్రేటర్ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. APR 25న లెక్కింపు జరగనుంది.

error: Content is protected !!