News March 28, 2024

ఈనెల 30న కాంగ్రెస్‌లోకి కేకే, విజయలక్ష్మి?

image

TG: BRS సీనియర్ నేత కె.కేశవరావు కాంగ్రెస్‌లో చేరే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన ఈనెల 30న హస్తం పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. కేకేతో పాటు ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కాసేపటి క్రితమే కేకే.. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీ మారేందుకు ఆయన అనుమతి తీసుకునేందుకు కేకే వెళ్లినట్లు తెలుస్తోంది.

Similar News

News October 4, 2024

‘ఎమ‌ర్జెన్సీ’ విడుదలకు తొలగిన అడ్డంకులు!

image

కంగన నటించిన ఎమ‌ర్జెన్సీ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగినట్టే కనిపిస్తోంది. సర్టిఫికేషన్‌ సంబంధిత సమస్యలను CBFCతో పరిష్కరించుకున్న‌ట్టు చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టుకు తెలిపారు. బోర్డు సూచించిన మార్పుల‌కు ఫిలిం మేక‌ర్స్ అంగీక‌రించారు. అన్ని మార్పుల‌తో కూడిన చిత్రం కాపీని బోర్డు మ‌రోసారి వీక్షించ‌నుంది. ఈ ప్ర‌క్రియ‌తో స‌ర్టిఫికెట్ జారీకి 14 రోజులు ప‌డుతుంద‌ని కోర్టుకు బోర్డు తెలిపింది.

News October 4, 2024

భారత్ టార్గెట్ ఎంతంటే?

image

మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ముందు న్యూజిలాండ్ 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా కివీస్ బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు ప్లిమ్మర్(34), బేట్స్(27) శుభారంభాన్ని ఇచ్చారు. మరో బ్యాటర్ డివైన్ (57) అర్థసెంచరీ చేయడంతో NZ 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుక 2, అరుంధతి, శోభన తలో వికెట్ తీశారు.

News October 4, 2024

BIG BREAKING: భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మరణించారు. సరిహద్దుల్లో మావోలు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టారు. వారికి మావోలు తారసపడటంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. కాగా ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 180 మంది మావోయిస్టులు మరణించారు.