News April 23, 2025

సివిల్స్ సర్వీసెస్‌లో నల్లమల వాసి సత్తా

image

అమ్రాబాద్ మండలం మన్ననూరుకి చెందిన మండలి లింగయ్య కుమారుడు మండలి సాయికిరణ్ నేడు ప్రకటించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 298 ర్యాంకు సాధించాడు. లింగమయ్య పెద్దకొత్తపల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సాయికిరణ్ ఐఏఎస్ సాధించడం పట్ల మన్ననూరు అంబేడ్కర్ కాలనీ ప్రజలతోపాటు అమ్రాబాద్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 23, 2025

వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

image

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.

News April 23, 2025

సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

image

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.

News April 23, 2025

KMR: వేసవి సెలవులు.. ఇంటి బాట పట్టిన విద్యార్థులు

image

పాఠశాలలు ముగియడం.. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది. వారి ఆనందానికి అవధుల్లేవు. చదువుల ఒత్తిడికి కాస్త విరామం దొరకడంతో సొంతూళ్లకు చేరుకుంటున్న విద్యార్థులతో పిట్లంలో సందడి వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది.

error: Content is protected !!