News April 23, 2025
జనగామ: వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కమిటీ పాలకవర్గ సమావేశం

జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమైన అభివృద్ధి పనులు ఎజెండాగా పెట్టి జనగామ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, అదేవిధంగా రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని పాలక మండలి సభ్యులకు సూచించారు.
Similar News
News April 23, 2025
HNK: ఇంటర్ ఫలితాల్లో ‘వేలేరు గురుకులం’ విజయదుందిబి!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో HNK జిల్లా వేలేరు గురుకుల కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి విజయదుందుబి మోగించారు. ఎంపీసీలో నందకిషోర్ 986/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. బైపీసీలో రాహుల్కు 980/1000 మార్కులు లభించాయి. ఎంపీసీలో సాయి గణేశ్ 464/470 మార్కులు, బైపీసీలో శశాంత్ 420/440 మార్కులు సాధించారు. విద్యార్థులను, స్టాఫ్ను ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ కుమార్ అభినందించారు.
News April 23, 2025
ఉమ్మడి ప.గో జిల్లాలో 10Th ఉత్తీర్ణత శాతం ఇలా..

10వ తరగతి ఫలితాల్లో ఉమ్మడి ప.గో. జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాదితో పోల్చితే ఈసారి ప.గో.జిల్లా మెరుగుపడగా ఏలూరు జిల్లా కాస్త తగ్గింది. ➤ ప.గో.జిల్లాలో గతేడాది 81.82% ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 82.15% శాతంతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. ➤ ఏలూరు జిల్లా విద్యార్థులు గతేడాది 80.08% శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. ఈ ఏడాది 77.24% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
సర్కార్ బడిలో మెరిసిన ఆణిముత్యం

తాజాగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో పల్నాడు జిల్లా విద్యార్థిని అద్భుతంగా రాణించారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల జడ్పీ పాఠశాల విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదవి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన విద్యార్థినిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ లలిత, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.