News April 23, 2025

పార్వతీపురం: ‘వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) 9552300009కు “హాయ్” అనండి..హాయిగా సేవలు పొందండి అన్నారు. ప్రభుత్వ వాట్సాప్ నంబరు 9552300009ను మన మిత్ర పేరుతో సేవ్ చేసుకోవాలన్నారు.

Similar News

News April 23, 2025

HYD: సంగారెడ్డి జైలుకు అఘోరి

image

లేడీ అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి PSకు తరలించి, 2 గంటల పాటు విచారించిన అనంతరం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అఘోరి చెప్పడంతో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ న్యాయవాది కుమార్‌ను జడ్జి నియమించారు. వాదనలు విన్న జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.

News April 23, 2025

మునగపాక: పెళ్లైన రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య

image

ఓ నవవధువు పెళ్లైన రెండు నెలలకే ఆత్మహత్య చేసుకుంది. మునగపాక బీసీ కాలనీలో శ్రీనివాసరావు, నాగమణి దంపతులు ఉంటున్నారు. వీరి కుమార్తె శరణ్యకు నాగమణి తమ్ముడితో ఈ ఏడాది ఫిబ్రవరి 20న వివాహం జరిగింది. ఆమె కొంతకాలంగా గైనిక్ సమస్యతో బాధపడుతోంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

News April 23, 2025

ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాలిబన్లు

image

J&K ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఇలాంటి ఘటనలు దేశభద్రతను దెబ్బతీస్తాయి’ అని తాలిబన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అటు ఈ ఉగ్రదాడులపై బంగ్లాదేశ్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

error: Content is protected !!