News April 23, 2025

జమ్ములో ఉగ్ర దాడి.. తీవ్రంగా ఖండించిన ఎంపీ

image

జమ్ము కశ్మీర్‌లో మంగళవారం టూరిస్ట్‌లపై ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరపడం తనను కలిచి వేసిందన్న ఆయన.. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు. దేశ సరిహద్దులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉగ్రవాదులకు గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Similar News

News April 18, 2026

నెల్లూరు: ఉద్యోగులకూ సమస్యలు

image

నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే శుక్రవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వివరించారు. ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు 4 శుక్రవారాలు ఉద్యోగుల గ్రీవెన్స్ డే చేపట్టగా.. 235 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 172 పరిష్కారించారు.

News April 18, 2026

నెల్లూరు: అధికారుల తప్పుడు లెక్కలు..!

image

నెల్లూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బ కేసులు నమోదు అవుతున్న వైద్యాధికారులు వాటిని లెక్కల్లో నమోదు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో 486, 2024లో 867, 2025లో 34 కేసులు నమోదయ్యాయి. 2026లో ఇప్పటివరకు ఒక్క కేసే నమోదైందని అధికారులు చెబుతున్నారు. గత నెల నుంచే ఎండలు తీవ్రంగా ఉన్నా.. అప్రమత్తత చర్యల్లో వైద్య శాఖ నిర్లక్ష్యంగా ఉంటోందనే విమర్శలు ఉన్నాయి.

News April 18, 2026

నెల్లూరు: అధికారుల తప్పుడు లెక్కలు..!

image

నెల్లూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బ కేసులు నమోదు అవుతున్న వైద్యాధికారులు వాటిని లెక్కల్లో నమోదు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో 486, 2024లో 867, 2025లో 34 కేసులు నమోదయ్యాయి. 2026లో ఇప్పటివరకు ఒక్క కేసే నమోదైందని అధికారులు చెబుతున్నారు. గత నెల నుంచే ఎండలు తీవ్రంగా ఉన్నా.. అప్రమత్తత చర్యల్లో వైద్య శాఖ నిర్లక్ష్యంగా ఉంటోందనే విమర్శలు ఉన్నాయి.