News April 23, 2025

ఆదోని మార్కెట్‌లో మళ్లీ పెరిగిన పత్తి ధరలు.!

image

కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్‌లో పత్తి ధర నిన్నటితో పోలీస్తే క్వింటాకు రూ.150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది గింజల ధర స్వల్పంగా పెరగడం, పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ పరిశ్రమల ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్‌కి రాకపోవడంతో ధరలు పెరిగాయి. ఆదోని మార్కెట్‌లో మంగళవారం పత్తి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.8,254 గా ఉంది. కనిష్ఠ ధర రూ.5,209 ఉండగా, మధ్యస్థ ధర రూ.7,639కి పెరిగింది.

Similar News

News April 18, 2026

మెదక్: వారసత్వ సంపదను కాపాడుకుందాం..!

image

అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు విశేష ఆకర్షణగా నిలుస్తున్నాయి. గంభీరమైన మెదక్ ఖిల్లా, ఏడుపాయల ఆలయం, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చర్చి, వేల్పుగొండ ఆలయం వంటివి జిల్లా ఖ్యాతిని చాటుతున్నాయి. వీటితో పాటు కొంటూరు మసీదు, చందంపేట మెట్ల బావి, ఘనపూర్ ఆనకట్ట వంటి కట్టడాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

News April 18, 2026

జగిత్యాలలో కేటీఆర్ పర్యటన.. BRSలోకి భారీగా చేరికలు

image

జగిత్యాలలో ఈనెల 20న నిర్వహించే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభ ఏర్పాటు పరిశీలించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు శనివారం రానున్నారు. మినీ స్టేడియంలో సభ ఏర్పాటు పరిశీలించిన అనంతరం మాజీమంత్రి జీవన్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. ఇదే సమయంలో గత 2 రోజులుగా కాంగ్రెస్‌లోని అసంతృప్త నాయకులను పెద్ద ఎత్తున BRSలో చేరికల కోసం జీవన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు.

News April 18, 2026

మహబూబ్‌నగర్‌లో ఉపాధి శిక్షణ

image

మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాల కోసం కంపెనీలు రానున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు https://forms.gle/a7ComMvBg6wmPXhT9 లింక్ ద్వారా నమోదు చేసుకుని, సర్టిఫికేట్లతో హాజరుకావాలని అధికారిణి మైత్రి ప్రియ కోరారు. వివరాలకు 89193 80410 నంబర్‌ను సంప్రదించవచ్చు.