News April 23, 2025

రాజమండ్రి: వ్యభిచారం నిర్వహిస్తున్న అన్నా చెల్లెలు

image

వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో రాజమండ్రిలోని ఓ స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. సీఐ మురళీకృష్ణ వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మదన్, తేజస్విలు అన్నా చెల్లెలు. వీరు విజయవాడ నుంచి వచ్చి రాజమండ్రిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని యువతులకు ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు యువతులు, విటులను పట్టుకున్నారు.

Similar News

News April 18, 2026

మోదీని ఇంతలా మోయాలా జగన్: షర్మిల

image

AP: బీజేపీతో <<19677732>>జగన్<<>> పెట్టుకున్న అక్రమ పొత్తు తేటతెల్లమైందని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ‘టీడీపీ, జనసేనల కంటే మోదీని ఇంతలా మోయాలా? అక్రమ డీలిమిటేషన్ బిల్లులపై NDA పక్షాన నిలబడ్డందుకు జగన్ సిగ్గుపడాలి. కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బతకాలా? జగన్ చేసిన ఈ నీచపు పనికి YSR ఆత్మ నిజంగా ఘోషిస్తోంది. ఏపీలో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్. ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ మాత్రమే’ అని స్పష్టం చేశారు.

News April 18, 2026

499/500.. 1 మార్క్ కోసం రీవాల్యుయేషన్‌కు వెళ్లిన అమ్మాయి!

image

CBSE టెన్త్ ఫలితాల్లో 90% వస్తేనే చాలామంది పండగ చేసుకుంటారు. కానీ ఆషిమాకు(కేరళం) 499 వచ్చినా సంతృప్తి చెందలేదు. తనకు అన్యాయం జరిగిందంటూ రీవాల్యుయేషన్‌కు రెడీ అయిపోయింది. అన్నింట్లో 100కు 100రాగా.. సైన్స్‌లో మాత్రం 99 వచ్చాయి. ఆ ఒక్క మార్కు కూడా తెచ్చుకొని 500/500 సాధిస్తానని ఆషిమా ధీమా వ్యక్తం చేస్తోంది. ‘టాపర్ కష్టాలు’ అంటే ఇవేనేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

News April 18, 2026

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆడుదాం.. ఆంధ్రా అక్రమాలు?

image

గత YCP హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అక్రమాలు ఎక్కువగా జరిగాయని ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ విచారణలో తేలింది. క్రీడాకారులకు ఇచ్చిన కిట్లు సైతం నాసిరకంగా ఉండటం, చేయని ఖర్చు చేసినట్లుగా చూపించి డబ్బులు దండుకున్నట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. బహుమతులు సొమ్ము కొట్టేయడం, పల్నాడు (D) అధికారి సంబంధించిన బిల్లులను సమర్పించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి.