News April 23, 2025

MDCL: ITI సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ITI సప్లమెంటరీ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మెకానికల్ డీజిల్ సహా ఇతర ట్రేడ్లకు సంబంధించిన విద్యార్థులు ‘ట్రేడ్ తీయరి’ సబ్జెక్టు పరీక్ష రాయగా, మంగళవారం ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఇన్నో విజన్ టెక్నాలజీస్లో CBT పరీక్ష పూర్తైంది. మిగతా అన్ని బ్రాంచీలకు పరీక్ష పూర్తైన తర్వాత ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు.

Similar News

News April 18, 2026

గుంటూరులో క్రికెట్ బెట్టింగ్.. ఆరుగురి అరెస్ట్!

image

గుట్టుచప్పుడు కాకుండా హోటల్లో క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి రోడ్డులోని MSగ్రాండ్‌లో బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ మేరకు రూ. 7,400 లిక్విడ్ క్యాష్, రూ. 1,54,000 ఆన్‌లైన్ క్యాష్‌ని పోలీసులు సీజ్ చేశారు.

News April 18, 2026

నాడు శ్రీకాకుళం కలెక్టర్.. నేడు స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ఉత్తమ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ చంద్ర పునేఠా నేడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. 1993-96 మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి సీఎస్ స్థాయికి చేరారు. ప్రస్తుతం విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించింది.

News April 18, 2026

WGL: రూ.2.5 కోట్ల మోసం.. మిర్చి వ్యాపారి అరెస్ట్

image

ఏనుమాముల మార్కెట్‌లో అడ్తిదారులను మోసం చేసిన మిర్చి వ్యాపారి లడే తిరుపతిని పోలీసులు అరెస్టు చేశారు. గాయత్రి చిల్లీస్ పేరిట వ్యాపారం చేస్తూ 49 మందితో మిర్చి కొనుగోలు చేసి, అదే సరకును ఇతరులకు విక్రయించి సుమారు రూ.2.5 కోట్లతో పరారయ్యాడు. ఈ నెల 2న విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేశారు. దేశాయిపేట వద్ద అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఆయన భార్య మాధవి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.