News March 28, 2024

యూఎన్ రిపోర్టును తప్పుబట్టిన కేంద్రమంత్రి

image

భారత్‌లో నిరుద్యోగ పరిస్థితి అధ్వానంగా ఉందన్న UN రిపోర్టును కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తప్పుబట్టారు. భారతీయ సంస్థల సర్వేల్లో భిన్నమైన గణాంకాలు ఉన్నాయన్నారు. ‘EPFOలో 6.4కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల జనాభా కంటే ఎక్కువ. 34 కోట్ల ముద్రా లోన్లు మంజూరు కాగా వీటితో చాలా మంది ఉపాధిని సృష్టిస్తున్నారు. మనం విదేశీ రేటింగ్ సంస్థలపై ఆధారపడటం మానుకోవాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News March 10, 2026

నన్ను తిట్టి, కొట్టేవాడు.. మాజీ క్రికెటర్‌పై కోర్టుకెక్కిన భార్య

image

IND మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై అతని భార్య గరిమా కాన్పూర్(UP) కోర్టును ఆశ్రయించారు. అమిత్, అతని ఫ్యామిలీ అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ తాగొచ్చి తిట్టి, కొట్టేవాడని, ఫుడ్ పెట్టకుండా వేధించేవాడని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది. షమీ కూడా గృహ హింస కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

News March 10, 2026

అక్రిలిక్ నెయిల్స్‌తో క్యాన్సర్ ముప్పు

image

చేతులు అందంగా కనిపించాలని కొందరు అమ్మాయిలు అక్రిలిక్ నెయిల్స్ పెట్టించుకుంటారు. అయితే వీటిని డ్రై చేయడానికి వాడే ల్యాంపులు UVA కిరణాలను విడుదల చేస్తాయి. ఇవి DNAకి హాని కలిగించి చర్మ క్యాన్సర్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే నెయిల్ సెలూన్‌కి వెళ్లినపుడు సన్‌స్క్రీన్/ UV ప్రొటెక్టెడ్ గ్లౌజెస్ వాడటం, LED ల్యాంపులు (UV కాకుండా) ఉపయోగించే సలూన్‌లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News March 10, 2026

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. లెక్కలు ఇవి

image

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే సభలో హాజరై, ఓటు వేసిన సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది మద్దతు ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న 543 సభ్యుల్లో 273 మంది సపోర్ట్ అవసరం. ప్రస్తుతం INDIA కూటమి బలం సుమారు 234 సీట్లు. విపక్షాలు అన్నీ ఓటు వేసినా NDA మెజారిటీ (293)ని దాటలేవు. దీంతో తీర్మానం వీగిపోయే అవకాశమే ఎక్కువ. స్పీకర్ ఓం బిర్లా తన పదవిలో కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది.