News April 23, 2025

ఎన్టీఆర్: ప్రధాని పర్యటన రూట్ మ్యాప్‌ను పరిశీలించిన అధికారులు

image

మే 2న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సంబంధిత రూట్ మ్యాప్‌ను అధికారులు బుధవారం పరిశీలించారు. విజయవాడ పశ్చిమ బైపాస్‌కు అనుసంధానమై ఉన్న సీడ్ యాక్సిస్ రహదారుల జంక్షన్‌లను సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ చంద్‌, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ రవికుమార్, NHAI ప్రాజెక్టు డైరక్టర్ పార్వతీశం,CRDA అధికారులతో కలసి ఆయా రహదారులను రూట్ మ్యాప్ నిమిత్తం పరిశీలించారు.

Similar News

News January 13, 2026

టెన్త్ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<>CCIO<<>>) 7 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై, 25ఏళ్ల లోపు గల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.36,306 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. సైట్: https://csio.res.in/

News January 13, 2026

నిజాంసాగర్: ఇన్ ఫ్లో 4067.. ఔట్ ఫ్లో 700

image

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా 700 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. మంగళవారం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 4,067 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 14.533 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వివరించారు. నిజాంసాగర్ నుంచి అల్లి సాగర్ ఎత్తిపోతల పథకం వరకు 1.25 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

News January 13, 2026

పేపర్ లీక్.. అశ్వారావుపేటలో ముగ్గురు ఏఈఓల సస్పెండ్

image

అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడి దొరికిపోయిన 30 మంది ఇన్ సర్వీస్ ఏఈఓలను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా షేర్ చేసి లీకేజీకి కారణమైన 30 మందితోపాటు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇందులో అశ్వారావుపేటలో ముగ్గురిపై ప్రభుత్వం వేటు వేసింది.