News April 23, 2025

ఎన్టీఆర్: ప్రధాని పర్యటన రూట్ మ్యాప్‌ను పరిశీలించిన అధికారులు

image

మే 2న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సంబంధిత రూట్ మ్యాప్‌ను అధికారులు బుధవారం పరిశీలించారు. విజయవాడ పశ్చిమ బైపాస్‌కు అనుసంధానమై ఉన్న సీడ్ యాక్సిస్ రహదారుల జంక్షన్‌లను సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ చంద్‌, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ రవికుమార్, NHAI ప్రాజెక్టు డైరక్టర్ పార్వతీశం,CRDA అధికారులతో కలసి ఆయా రహదారులను రూట్ మ్యాప్ నిమిత్తం పరిశీలించారు.

Similar News

News April 18, 2026

ఏపీలో ప్రతిపక్షమేది?

image

ఏపీలో ఉన్న మూడు పెద్ద ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకోగా.. జగన్ పొత్తు లేకపోయినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ BJPకి వ్యతిరేకంగా ఉన్నా దానికి పెద్దగా ప్రజల మద్దతు దక్కడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సౌత్ రాష్ట్రాలన్నీ ఒక దారిలో ఉంటే ఏపీది మరో దారి. మరి ఏపీలో ప్రతిపక్షమేది?

News April 18, 2026

GWL: దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక గ్రీవెన్స్

image

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు. గ్రీవెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, ఉపకరణాల పంపిణీ, సదరం సర్టిఫికెట్లు తదితర సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

News April 18, 2026

డీలిమిటేషన్.. జాతీయ మీడియాలో రేవంత్ పేరు!

image

131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లుల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా సీఎంల కంటే ముందుగా రేవంతే ఈ అంశాన్ని లేవనెత్తారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్‌కు అన్యాయం జరుగుతుందని కేంద్రాన్ని విమర్శించారు. హైబ్రిడ్ మోడల్‌లో డీలిమిటేషన్ జరగాలని సరికొత్త పాయింట్‌ను తెరపైకి తెచ్చారు.