News April 23, 2025
వీరయ్య చౌదరి హత్యపై రెండు జిల్లాల పోలీసుల చర్చలు

TDP అధికార ప్రతినిధి, మాజీ MPP వీరయ్య చౌదరి హత్య విచారణకు సంబంధించి, తీసుకోవలసిన చర్యలపై బాపట్ల SP తుషార్ డూడి, ప్రకాశం SP దామోదర్ ఇరువురు చర్చించుకున్నారు. CM చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పక్క పక్కనే ఉన్న రెండు జిల్లాల ఎస్పీలు హత్య విచారణకు సంబంధించిన విషయాలు చర్చించుకోవడంతో హంతకులను త్వరలోనే అరెస్టు చేయటానికి పోలీస్ శాఖ సిద్ధమైనట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
Similar News
News April 19, 2026
ఏపీ విభజన వ్యాఖ్యల వివాదం.. తేజస్వీ సూర్య ఏమన్నారంటే?

తెలంగాణను ఉద్దేశించి లోక్సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంపై BJP MP తేజస్వీ సూర్య స్పందించారు. ‘కాంగ్రెస్ నిరక్షరాస్యుల పార్టీ. నేనేం మాట్లాడానో ఆ పార్టీ నేతలు మళ్లీ వినండి. ఆ సింపుల్ మాటలను వీలైతే అర్థం చేసుకోండి. INC లీడర్లు ఉద్దేశపూర్వకంగా, అజ్ఞానంతో నిరసన తెలుపుతున్నారు’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ఉమ్మడి APని IND, PAK తరహాలో విభజించారని తేజస్వీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
News April 19, 2026
నిర్మల్: 23న బడుల్లో తల్లిదండ్రుల సమావేశం

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 23న తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించాలని డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ భేటీ జరుగుతుంది. విద్యార్థుల విద్యా పురోగతి, పరీక్షా ఫలితాలపై చర్చించి ప్రగతి పత్రాలను అందజేస్తారు. వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని, తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ కోరింది.
News April 19, 2026
HYD: సంక్షోభంలో MMTS.. సేవ్ చేసేందుకా?

2008లో MMTS కూతపెట్టినప్పుడు నగరవాసులకదో గొప్ప అనుభవం. అయితే <<19689756>>ఇప్పుడు<<>> MMTSను కాపాడుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఓ ‘ఎమర్జెన్సీ మెజర్’అని తెలుస్తోంది. కొవిడ్కు ముందు రోజుకు లక్షన్నర మంది ప్రయాణించిన MMTSలో, ప్రస్తుతం 40 వేలకు పడిపోయింది. ‘మహాలక్ష్మి’ పథకంతో రైల్వే ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయినట్లు ఈ గణాంకాలే చెబుతున్నాయి. అందరికీ ఫ్రీ అంటే జనం మళ్లీ రైలెక్కుతారని సర్కార్ నమ్ముతోంది.


