News April 23, 2025
‘పేదరికం నుంచి బయటకి వచ్చేలా అవగాహన కల్పించాలి’

బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకి తెచ్చేలా అవగాహన కల్పించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. పి4 అమలు తీరుపై జిల్లా, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం, వారి భవిష్యత్తు అభివృద్ధిపై ప్రణాళికతో అవగాహన కల్పించడం ముఖ్యమని కలెక్టర్ చెప్పారు.
Similar News
News April 24, 2025
కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు ముమ్మరం!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు SP బిందుమాధవ్ ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ మణీష్ దేవరాజ్ కేసు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వం ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమించింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ MLC అనంతబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
News April 24, 2025
ఎండల వేళ.. జాగ్రత్త!

కొన్నిరోజులగా నంద్యాల జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. 40 నుంచి 44 °C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నీటిని బాగా తాగడంతోపాటు చలువ కోసం కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు.
News April 24, 2025
ట్రంప్పై కోర్టుకెక్కిన 12 రాష్ట్రాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై ఆ దేశానికి చెందిన 12 రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించాయి. ‘1977లో చేసిన చట్టం ప్రకారం టారిఫ్ను విధించేందుకు అత్యవసర చర్యలు తీసుకునే అధికారం అధ్యక్షుడికి లేదు. చట్టసభకు మాత్రమే ఆ అధికారముంది. ఇష్టారాజ్యంగా టారిఫ్లు విధించి అధ్యక్షుడు రాజ్యాంగాన్ని మీరారు. దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేశారు’ అని తమ దావాలో ప్రభుత్వాలు ఆరోపించాయి.