News April 23, 2025
కామారెడ్డి: సబ్స్టేషన్ను తనిఖీ చేసిన వరుణ్ రెడ్డి

టీజీఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ ఎండీ వరుణ్ రెడ్డి బుధవారం కామారెడ్డి జిల్లాలోని సిరిసిల్ల రోడ్ వద్ద 33/11 కేవీ సబ్స్టేషన్ను తనిఖీ చేశారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సబ్స్టేషన్లో సాంకేతికత అభివృద్ధిపై సూచనలు చేశారు. కలెక్టరేట్లో ఇంజినీర్లు, అకౌంట్స్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News April 18, 2026
ద్విచక్ర వాహనాలు ఢీ.. పదో తరగతి విద్యార్థి మృతి

టేక్మాల్ (M) ఎల్లంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సండ్రు సదానందం (16) మృతి చెందగా, శెట్టి గోపాల్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ వేర్వేరు బైక్లపై వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే సదానందం ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడు ఇటీవలనే SSC పరీక్షలు రాశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 18, 2026
ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

* 1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
* 1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
* 1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
* 1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
* 1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరణం(ఫొటోలో)
* 1980: సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ జననం
* ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం
News April 18, 2026
కామారెడ్డి: డ్రంకెన్ డ్రైవ్.. 68 మందికి శిక్షలు

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 68 మందికి కోర్టు శిక్షలు విధించింది. ఇందులో 12 మందికి జైలు శిక్ష పడగా మొత్తం ₹82,700 జరిమానా విధించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రాణాంతకమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.


