News April 24, 2025
భారత్ ఆరోపణలు.. పాక్ ప్రధాని రేపు కీలక భేటీ

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని దాయాది దేశంపై భారత్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్లో విజయవంతంగా ఎన్నికల నిర్వహణ, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న వేళ దాడులకు పాల్పడినట్లు విమర్శించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ రేపు నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ తెలిపారు. భారత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తారన్నారు.
Similar News
News April 25, 2025
యుద్ధ భయం.. ఒడిదొడుకుల్లో భారత మార్కెట్లు

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇవాళ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. యుద్ధ భయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ తొలుత గ్రీన్లోనే మొదలైనా క్రమంగా రెడ్లోకి పడిపోయాయి. ప్రస్తుతం బీఎస్ఈ 60 పాయింట్లు నష్టపోయి 79,742 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 24,213 వద్ద కొనసాగుతోంది.
News April 25, 2025
ఉగ్రదాడి: ఆలస్యమే వారిని రక్షించింది!

పహల్గామ్ ఉగ్రదాడిలో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాణం ఆలస్యం కావడంతో 39 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గుర్రాలు అందుబాటులో లేక 28 మంది, ఓ రెస్టారెంట్లో ఫుడ్లో ఉప్పు ఎక్కువైందని కేరళ ఫ్యామిలీ ఆగిపోయింది. అదే సమయంలో ఉగ్ర దాడులు చోటు చేసుకోగా అనుకోని ఆలస్యం వీరిని మృత్యువు నుంచి తప్పించింది. మరోవైపు దాడి జరిగిన టైమ్లో భేల్పూరి తినేందుకు స్నాక్ బ్రేక్ తీసుకున్న ఓ జంట ప్రాణాలతో బయటపడింది.
News April 25, 2025
సంజూ లేని లోటు మాకు కనిపిస్తోంది: సందీప్

కెప్టెన్ సంజూ శాంసన్ లేని లోటు తమ జట్టుకు తెలుస్తోందని రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ అన్నారు. ‘సంజూ చాలా అనుభవజ్ఞుడైన బ్యాటర్, కెప్టెన్. మా లైనప్లో తను లేని లోటు కనిపిస్తోంది. అతడి గాయం మాకు చాలా నష్టం చేసింది’ అని పేర్కొన్నారు. తొలి 3 మ్యాచులు బ్యాటర్గా ఆడిన సంజూ, ఆ తర్వాత పక్కటెముకల గాయంతో జట్టుకు దూరమయ్యారు. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచుల్లో గెలవాల్సిన స్థితి నుంచి RR ఓటమిపాలైంది.