News April 24, 2025
HYD: ఎండలు.. సర్దుకుపోదాం!

HYDలో ఎండలు దంచికొడుతున్నాయి. G+1 భవనం, పెంట్ హౌస్, రేకుల ఇంట్లో ఉండే మధ్య తరగతి, పేదవాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సీలింగ్, టేబుల్ ఫ్యాన్ ఉన్నా ఉపశమనం లేదని వాపోతున్నారు. మార్కెట్లో కూలర్లు, ACలకు డిమాండ్కు తగ్గట్లే ధరలున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బుల్లేక EMI దిక్కు అయ్యిందని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు. స్థోమత లేని పేదోడు షాపులో కొనలేక, ఇంట్లోనే సర్దుకుపోతున్నాడు.
Similar News
News July 7, 2025
HYD: యుద్ధం ప్రకటించిన సందర్భం అది: సీఎం

టీపీసీసీ చీఫ్గా ఎన్నికైన సందర్భాన్ని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేసుకున్నారు. ‘నియంతృత్వాన్ని సవాల్ చేసి.. నిర్భందాన్ని ప్రశ్నించి, స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన సందర్భం అది. నేటి ప్రజాపాలనకు నాడు సంతకం చేసిన సంకల్పం. సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ అండతో టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన జూలై 7ను జీవితంలో మరచిపోలేనని సీఎం రేవంత్ రెడ్డి Xలో ట్వీట్ చేశారు.
News July 7, 2025
HYD: NIMS ఆసుపత్రిలో OP తీసుకోవడం ఇక చాలా ఈజీ.!

HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో OP తీసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి గతంలో ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితికి అధికారులు చెక్ పెట్టారు. ఆసుపత్రిలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసి OP రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్లిప్పు అందించే ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే స్లిప్పు వచ్చేస్తుంది. దీంతో సేవలు చాలా ఈజీగా అవుతాయని అధికారులు తెలిపారు.
News July 7, 2025
HYD: జంట జలాశయాలలో నీరు పుష్కలం.!

HYD నగర శివారు జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉందని జలమండలి తెలిపింది. ఉస్మాన్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782.75 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుతం 1758 అడుగులు ఉన్నట్లు తెలిపారు. గత రికార్డుతో పోలిస్తే ఈసారి నీరు అధికంగా ఉందన్నారు.