News April 24, 2025

కడప: తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – కలెక్టర్

image

తాగునీటి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం ప్రొద్దుటూరు నియోజకవర్గ అబివృద్ధి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పశువులకు నీటి సరఫరా కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, జమ్మలమడుగు అర్డీఓ సాయిశ్రీ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 24, 2026

బ్రహ్మంగారిమఠంలో రూ.139 కోట్లతో పనులు

image

బ్రహ్మంగారిమఠంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రసాదం పథకం ద్వారా రూ.139కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆధునిక హంగులతో దేవస్థానం అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News January 24, 2026

గరుడ వాహనంపై వైకుంఠనాథుడి దర్శనం

image

దేవుని గడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. ఉదయం నుంచి స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

News January 23, 2026

కడప: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

image

కడప జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19 నుంచి అందుబాటులోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.