News April 24, 2025
ఈతకు వెళ్లి బీఫార్మసీ విద్యార్థి మృతి

నెల్లూరు జిల్లాలో చదువుకుంటున్న అనంతపురం యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందాడు. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన అంజి నార్త్ రాజుపాలెంలోని వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సమీపంలోని రేగడిచిలక వద్ద బావి దగ్గరికి ఐదుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బావిలో మునిగి చనిపోయాడు.
Similar News
News April 19, 2026
పీజీఆర్ఎస్ కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
News April 19, 2026
పీజీఆర్ఎస్ కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
News April 19, 2026
అనంతపురం జిల్లాలో ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఇంటర్ ఫలితాల్లో అనంతపురం జిల్లా రాష్ట్రంలో ఫస్టియర్ ఫలితాల్లో 15వ స్థానం, సెకండియర్లో 78 శాతం ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ఫస్టియర్లో 22,367 మందికి 15,814 మంది పాసయ్యారు. సెకండియర్లో 20,778 మందికి 15,530 మంది పాసయ్యారు. సెకండియర్కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితో పాటు పాసైన వారూ మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు ఉంటాయి.


