News April 24, 2025
పాక్పై సానుభూతి చూపేదిలేదు: కిషన్రెడ్డి

దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రదాడి వెనకున్న పాక్తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మంచి పరిణామమన్నారు. ఆ దేశంపై సానుభూతి చూపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు దౌత్యపరమైన సమాధానమే ఇచ్చామని, త్వరలో మిలటరీ పరంగానూ ఆన్సర్ ఉంటుందని తెలిపారు. ఉగ్రదాడిలో పోయిన ప్రతి ప్రాణానికి ప్రతీకారం తప్పదనే సంకేతాలు కేంద్రం ఇచ్చిందన్నారు.
Similar News
News November 18, 2025
ఇన్నేళ్లయినా 21వేల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ లేదు!

ఇండియాలో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలున్నాయి. తాజాగా లద్దాక్లోని మారుమూల గ్రామాలైన మాన్ & మెరాక్లో ఎయిర్టెల్ తన సేవలను ప్రారంభించింది. దేశంలో 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 21వేల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 6వేల గ్రామాలు ఫోన్ వాడట్లేదు. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు.
News November 18, 2025
ఇన్నేళ్లయినా 21వేల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ లేదు!

ఇండియాలో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలున్నాయి. తాజాగా లద్దాక్లోని మారుమూల గ్రామాలైన మాన్ & మెరాక్లో ఎయిర్టెల్ తన సేవలను ప్రారంభించింది. దేశంలో 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 21వేల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 6వేల గ్రామాలు ఫోన్ వాడట్లేదు. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు.
News November 18, 2025
చానెల్ CEO లీనా నాయర్ గురించి తెలుసా?

అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ ‘Chanel’ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్ భారతీయురాలని మీకు తెలుసా. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పుట్టి పెరిగిన లీనా మేనేజ్మెంట్ డిగ్రీ చేశారు. 1992లో HULలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ ఆమె దక్షతను మెచ్చి చానెల్ CEOగా ఎంపిక చేశారు. ఆమె అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.


