News April 24, 2025
IPL: నేడు RCBvsRR.. గెలిచేదెవరో?

ఇవాళ RCB, RR మధ్య బెంగళూరు వేదికగా రా.7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచులు ఆడగా RCB 16, రాజస్థాన్ 14 గెలిచాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు (10pts) నాలుగు, RR ఎనిమిదో (4pts) స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు RCB తన సొంత గ్రౌండ్లో గెలవలేదు. అటు RR గెలవాల్సిన మ్యాచుల్లో చేజేతులా ఓడుతోంది. ఆ జట్టు కెప్టెన్ శాంసన్ నేటి మ్యాచుకూ దూరం కానున్నట్లు సమాచారం.
Similar News
News August 23, 2025
సుధాకర్ రెడ్డి కళ్లు, భౌతిక కాయం దానం

సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(83) అనారోగ్యంతో <<17489969>>కన్నుమూసిన<<>> సంగతి తెలిసిందే. ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఇచ్చారు. భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం నుంచి మ.3 గంటల వరకు హిమాయత్నగర్లోని మగ్దూం భవన్లో భౌతిక కాయాన్ని ఉంచి, అనంతరం గాంధీ కాలేజీకి అప్పగిస్తారు. సుధాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
News August 23, 2025
నవంబర్లో ఇండియాకు లియోనల్ మెస్సీ!

ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ నవంబర్లో ఇండియాకు రానున్నట్లు కేరళ క్రీడాశాఖ మంత్రి వి.అబ్దుహ్మాన్ తెలిపారు. మెస్సీతోపాటు అర్జెంటీనా జట్టు మొత్తం కేరళకు వస్తుందని ఆయన ప్రకటించారు. తిరుప్పూర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగే ఓ ఫ్రెండ్లీ మ్యాచులో అర్జెంటీనా తలపడనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే సమయంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో మెస్సీ క్రికెట్ కూడా ఆడతారని వార్తలు వస్తున్నాయి.
News August 23, 2025
దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు

దేశంలోనే అత్యంత ధనిక CMగా చంద్రబాబు నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తెలిపింది. ఆయన ఆస్తులు రూ.931 కోట్లకుపైగా, అప్పులు రూ.10కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ CM పెమా ఖండ్ రెండో స్థానంలో, రూ.30 కోట్ల ఆస్తులతో రేవంత్ ఏడో స్థానంలో ఉన్నారు. అలాగే అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న CMగా మమతా బెనర్జీ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.15 లక్షలు మాత్రమే.