News April 24, 2025

పీలేరు: నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

image

నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం గుర్రంకొండలో జరిగింది. పీలేరు మండలం కోటపల్లి వాసి మోసిన్ గుర్రంకొండ కుమ్మరిపల్లిలోని తన అత్తగారి ఇంటి దగ్గర తాపీ మేస్త్రి పని కోసం భార్యాబిడ్డలతో సహా వెళ్లి రెండు రోజులుగా అక్కడే పని చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో మోసిన్ కొడుకు అయాన్ (3) ఆడుకుంటూ బుధవారం సాయంత్రం 4 సమీపంలో పొరపాటున నీటి తొట్టిలో పడి మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

Similar News

News April 18, 2026

సంబేపల్లెలో గురుకుల విద్యార్థిని మృతి

image

సంబేపల్లె మండలం ఎర్రగుంట్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదువుతున్న రెడ్డిరాణి 14 (9వ తరగతి) విద్యార్థి శనివారం తెల్లవారుజామున మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థినికి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండడంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతి చెందినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 18, 2026

ప.గో : పెట్రోల్ బంకుల్లో జిమ్మిక్కులు…!

image

జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో సిబ్బంది జిమ్మిక్కులు చేస్తున్నారని సమాచారం. వాహనాల్లోకి పెట్రోల్ నింపకుండానే నిండినట్లుగా సొమ్ములు వసూలు చేసి, వాహనదారులు నిలదీస్తే కాళ్ల బేరానికి వస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గురువారం రాత్రి పెంటపాడు (M) అలంపురం ఒక పెట్రోల్ బంకులో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. పెట్రోలు కొట్టించి బంకు కూడా దాటకుండానే వాహనం ఆగిపోవడంతో సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది.

News April 18, 2026

MBNR: అక్కడ.. 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గండీడ్ మండలం సల్కర్‌పేట 43.6, దేవరకద్ర 43.1, కోయిలకొండ మండలం పారుపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.9, మేడ్చల్ మండలం దోనూరు కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 42.5, అడ్డాకుల 42.4, మహమ్మదాబాద్ 42.3, MBNR (U/R) 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.