News April 24, 2025

నల్గొండ జిల్లాలో సుర్రుమంటున్న ‘సూరన్న’

image

నల్గొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయి అనే నాణుడిని నిజం చేస్తూ రోహిణీకి ముందే సూరన్న సుర్రుమంటున్నాడు. బుధవారం కట్టంగూర్‌లో ఏకంగా రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడ్గులపల్లి 45.2, నిమనూరు 44.9, త్రిపురారం 44.8, నార్కట్‌పల్లి 44.6, అనుముల 44.6, వేములపల్లి 44.6, దామరిచర్ల 44.4, తిప్పర్తిలో కనిష్ఠంగా 44.1 డిగ్రీలు నమోదయ్యాయి.

Similar News

News April 24, 2025

రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులు

image

భూముల రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వివాదాలను తగ్గించేందుకు ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారిని ప్రభుత్వం నియమిస్తుందని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. గురువారం మునుగోడులో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. సర్వే సమస్యల పరిష్కారానికి 6000 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమించబోతుందని వెల్లడించారు.

News April 24, 2025

NLG: ప్రభుత్వ కాలేజీల్లో తగ్గుతున్న ఫలితాలు

image

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో 12 జూనియర్ కళాశాలలు ఉండగా నాంపల్లి 85.71, చింతపల్లి 76.92, హిల్ కాలనీ 66.91, దేవరకొండ (బాలికలు) 58.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన కాలేజీల్లో 50 శాతం లోపే ఉత్తీర్ణత రాగా, అతి తక్కువగా నకిరేకల్ కళాశాలలో 26.8 శాతం ఫలితాలు వచ్చాయి. ఫలితాలు తగ్గడానికి విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోవడమే కారణమని అధ్యాపకులు భావిస్తున్నారు.

News April 24, 2025

NLG: టీపీసీసీ పరిశీలకుల నియామకం!

image

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాకు పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు మక్తల్ ఎమ్మెల్యే వి.శ్రీహరి ముదిరాజ్, నజీర్ అహ్మద్‌ను పరిశీలకులుగా నియమించింది. వీరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలా..? లేక కొత్తవారిని నియమించాలా..? అనే దానిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించి అధిష్ఠానానికి నివేదిక సమర్పించనున్నారు.

error: Content is protected !!