News April 24, 2025

భద్రాచలంలో 43.1°C అత్యధిక ఉష్ణోగ్రత

image

జిల్లాలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా భద్రాచలంలో 43.1°C ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా దమ్మపేటలో 39.1°C ఉష్ణోగ్రత నమోదైంది. పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం మండలాల్లో 43°C, కరకగూడెంలో 42.9°C, చుంచుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, మణుగూరు మండలాల్లో 42.7°C ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Similar News

News April 24, 2025

విశాఖలో పంచాయ‌తీ రాజ్ దినోత్స‌వ వేడుకలు

image

జాతీయ పంచాయ‌తీ రాజ్ దినోత్స‌వం విశాఖ జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో గురువారం నిర్వహించారు. జిల్లా ప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో జిల్లా ప‌రిష‌త్ ఛైర్‌పర్సన్ జె.సుభ‌ద్ర‌తో కలిసి క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ పాల్గొన్నారు. వీరు మ‌హాత్మా గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. బలమైన భారతదేశానికి బలమైన గ్రామ పాలన అవసరమని జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గుర్తు చేస్తుందన్నారు.

News April 24, 2025

నిర్మల్: వడదెబ్బతో యువకుడి మృతి

image

వడదెబ్బతో యువకుడు మృతి చెందిన ఘటన నిర్మల్‌లో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని బ్రహ్మపురికి చెందిన మహ్మద్ బేగ్ కుమారుడైన సోఫీ బేగ్ వడదెబ్బ తగలడంతో రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ నిర్మల్ ఆసుపత్రిలో మృతిచెందారు. సోఫీ బేగ్ మూడ నెలల కిందటే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు.

News April 24, 2025

సూర్యాపేట: త్వరలో డీసీసీ అధ్యక్షుడి ప్రకటన

image

డీసీసీ అధ్యక్ష పదవుల లిస్ట్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడి రేసులో పటేల్ రమేష్ రెడ్డి, జ్ఞాన సుందర్, చకిలం రాజేశ్వరరావు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్యాపేట అధ్యక్షుడిగా చెవిటి వెంకన్న యాదవ్ ఉన్నారు. త్వరలోనే అధ్యక్షుడిని ఫైనల్ చేసి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

error: Content is protected !!