News April 24, 2025

ప.గో జిల్లా టాపర్ ఈ బాలికే..!

image

నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతీ బా పూలే గురుకుల పాఠశాల (బాలికలు)విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో ప్రతిభ చూపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రావి అశ్విని 592 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సీహెచ్ కె. శైలజ తెలిపారు. పెరవలి గ్రామానికి చెందిన అశ్విని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ ఉంటారు.

Similar News

News April 24, 2025

భీమవరంలో యాంకర్ అనసూయ సందడి

image

భీమవరంలో సినీనటి అనసూయ సందడి చేశారు. గురువారం భీమవరంలోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె వచ్చారు. అనసూయను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. భీమవరం చాలా సార్లు వచ్చానని, ఇక్కడ అభిమానం ఎప్పటికీ మరవలేనని, ఎన్నిసార్లు అయినా భీమవరం వస్తానని అనసూయ అన్నారు.

News April 24, 2025

యలమంచిలిలోని కొంతేరులో హత్య

image

యలమంచిలి మండలం కొంతేరులో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. సరిహద్దు గొడవల నేపథ్యంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కత్తుల పౌలు (58)ను బత్తుల ఏసుదాసు నరికాడు. మెడపై తీవ్రగాయాలు కావడంతో పౌలు మంచంపై మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని నరసాపురం డీఎస్పీ జి. శ్రీవేద, పాలకొల్లు రూరల్ సీఐ జి. శ్రీనివాస్, ఎస్సై కె. గుర్రయ్య పరిశీలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 24, 2025

పాలకోడేరు : ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. కేసు

image

పాలకోడేరు మండలం మోగల్లు వశిష్ట మెరైన్స్ ఆక్వా పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకై మంగళవారం ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు పలువురు అస్వస్థతకు గురవ్వగా, మరికొంత మంది ఊపిరాడక బయటకు పరుగులు తీసేటప్పుడు గాయాలపాలయ్యారు. దీనిపై ఓ మహిళా కార్మికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు స్టేషన్ రైటర్ నాగరాజు తెలిపారు.

error: Content is protected !!