News March 28, 2024
మరిన్ని మ్యాచ్లకు సూర్య దూరం
IPLలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మరికొన్ని మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం. స్పోర్ట్స్ హెర్నియాతో ఇబ్బంది పడుతున్న అతడు జనవరిలో సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం NCA వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న మిస్టర్ 360 ఇంకా పూర్తిగా కోలుకోలేదు. త్వరలో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో సూర్యపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
Similar News
News October 5, 2024
చైనాలో ఏటా టన్నుల కొద్దీ పాములు స్వాహా!
చైనీయులు ఏటా ఏకంగా 10వేల టన్నులకు పైగా పాముల్ని స్వాహా చేస్తున్నారని ఆ దేశ వన్యప్రాణ సంరక్షణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా షాంఘై, గ్వాంగ్డాంగ్ ప్రావిన్సుల్లో సర్పాలకు మహా డిమాండ్. ఒక్క షాంఘైలోనే 6వేల వరకూ పాము మాంసం హోటళ్లు ఉండటం గమనార్హం. తాచుపాముల నుంచి సముద్రపు పాముల వరకూ అన్నింటినీ చైనీయులు ఇష్టంగా తినేస్తారు. దీని వల్ల పర్యావరణ అసమతుల్యత తలెత్తే ప్రమాదం ఉందంటూ సంస్థ హెచ్చరించింది.
News October 5, 2024
గంభీర్ నా సోదరుడి లాంటివాడు: అక్మల్
టీమ్ ఇండియా కోచ్ గంభీర్, పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తరచూ గొడవ పడేవారన్న సంగతి తెలిసిందే. 2010లో ఆసియా కప్ సందర్భంగా ఒకరినొకరు సవాలు చేసుకోగా అంపైర్లు జోక్యం చేసుకుని విడిపించారు. అయితే అదంతా గ్రౌండ్ వరకేనని అక్మల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమ ఇద్దరికీ వివాదాలేవీ లేవని, ఆయన తనకు సోదరుడితో సమానమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరం మంచి స్నేహితులమని వివరించారు.
News October 5, 2024
భారత మహిళల జట్టు ఓటమి
WT20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో భారత్ ఓటమి మూటగట్టుకుంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 రన్స్ చేసింది. 161 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఏ దశలోనూ టార్గెట్ ఛేదించేలా కనిపించలేదు. మంధాన(12), షఫాలీ(2) హర్మన్(15), రోడ్రిగ్స్(13), రిచా(12) పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో IND 102కే ఆలౌట్ అయింది.