News April 24, 2025

ఉగ్రదాడి: పాకిస్థాన్ అధికారుల సెలబ్రేషన్

image

పాక్ నిజ స్వరూపం మరోసారి బయటపడింది. పహల్గాం మారణహోమం తర్వాత ఆ దేశ ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుందని తెలుస్తోంది. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని ఆ దేశ దౌత్యాధికారులు రాక్షసానందం పొందారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ ఉదయం హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు భారీగా చేరుకుని పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. PoKను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 24, 2025

మోదీ సర్కారుపై సంచలన ఆరోపణలు.. ఎమ్మెల్యే అరెస్టు

image

పహల్గామ్ ఉగ్రదాడిలో మోదీ సర్కారు కుట్ర ఉందన్న అస్సాం AIDUF ఎమ్మెల్యే <<16202042>>అమినుల్ ఇస్లాంను<<>> పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసినా, సపోర్ట్ చేయడానికి ప్రయత్నించినా సహించేది లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. సదరు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని అమినుల్ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి.

News April 24, 2025

ఈ ‘హీరో’యిన్‌ను మెచ్చుకోవాల్సిందే..

image

ఉగ్రదాడిపై స్పందించేందుకు సెలబ్రిటీలు తటపటాయిస్తుంటే తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల చేసిన పనికి ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ (నెల్లూరు) భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె, కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా గతేడాది విజయవాడ, ఖమ్మం వరదల సమయంలోనూ తన వంతు బాధ్యతగా రూ.5 లక్షల విరాళం ప్రకటించారు.

News April 24, 2025

పహల్గామ్ బాధితులకు ఫ్రీ ట్రీట్‌మెంట్: అంబానీ

image

పహల్గామ్ ఉగ్రదాడిలో గాయపడినవారికి ముంబైలోని సర్ హెచ్ఎన్ ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. ‘ఉగ్రదాడి మానవాళికే మచ్చ. అది ఏ రూపంలో ఉన్నా సహించకూడదు. ప్రాణాలు కోల్పోయినవారికి నా ప్రగాఢ సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. దేశం తరఫున అంబానీ కుటుంబం ఎప్పుడూ నిల్చునే ఉంటుంది’ అంటూ ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!