News April 24, 2025

గద్వాల: కాలువలో మహిళ మృతదేహం లభ్యం

image

జోగులాంబ గద్వాల పట్టణంలోని అగ్రహారం కాలువలో గుర్తుతెలియని వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైందని పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్‌ తెలిపారు. కాలువలో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వయసు సుమారు 60 ఏళ్లు ఉంటుందన్నారు. నల్లటి జాకెట్, పింక్ చీర ధరించి ఉందని, ఆమె ఆచూకీ ఎవరికైనా తెలిస్తే గద్వాల పట్టణ పోలీస్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Similar News

News January 10, 2026

పెద్దచింతరేవుల ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

image

ధరూర్ మండలం పెద్దచింతరేవుల గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి బ్రహోత్సవాలు ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణధికారి సి.కవిత తెలిపారు. ఈనెల 22న రాత్రి తెప్పోత్సవం, ప్రభోత్సవం ఉంటాయన్నారు. ఈనెల 23 శుక్రవారం రాత్రి 10 గంటలకు రథోత్సవం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని బ్రహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

News January 10, 2026

భద్రాద్రి: ‘రెండో శనివారం, ప్రభుత్వాసుపత్రికి సెలవు’

image

అశ్వారావుపేట(M) వినాయకపురం ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరుపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన మోర్ల సతీష్, సూరిబాబు 2 రోజులుగా విషజ్వరంతో ఇక్కడ చికిత్స పొందుతున్నారు. శనివారం కూడా వారు వైద్యం కోసం ఆసుపత్రికి రాగా, మధ్యాహ్నం వరకు వేచి చూడాలని సిబ్బంది చెప్పారు. తీరా మధ్యాహ్నం అయ్యాక.. ‘ఈరోజు రెండో శనివారం, ఆసుపత్రికి సెలవు’ అని చెబుతూ తాళం వేసి వెళ్లిపోయారని రోగులు వాపోయారు.

News January 10, 2026

గండికోట ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు

image

గండికోట ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈనెల 11, 12, 13న ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు RTC రీజనల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి శనివారం తెలిపారు. జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల నుంచి మొత్తం 39 బస్సులను నడుపుతున్నామన్నారు. జమ్మలమడుగు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 10 వరకు బస్సులు తిరుగుతాయన్నారు. ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.