News March 28, 2024
ఇతడు 200 మంది పిల్లలకు తండ్రి

బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస పటా సెకా 200 మంది పిల్లలకు తండ్రయ్యాడు. ఏడడుగులు, కండలు తిరిగిన దేహంతో ఆజానుబాహుడిగా ఉండేవాడు. 19వ శతాబ్దంలో బానిసల యజమానులు అతడిని బానిసగా మార్చి నల్లజాతి యువతులు, మహిళలతో సంపర్కం చేయించేవారు. అలా పలువురు యువతులు, మహిళలకు 200 మందికిపైగా పిల్లలు పుట్టారు. అతడి వల్ల జన్మించే బిడ్డలను 11 ఏళ్లకే కష్టమైన పనులకు ఉపయోగించుకునేవారు. సెకా 130 ఏళ్లు బతికినట్లు సమాచారం.
Similar News
News March 25, 2026
రాహుల్ పర్యటన రద్దు.. కేరళంకు రేవంత్

కడుపు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళం టూర్ రద్దయింది. రాహుల్కు బదులుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు TG CM రేవంత్ కేరళంకు బయల్దేరారు.
News March 25, 2026
IPL: కెప్టెన్లంతా ఒకే చోట

ఐపీఎల్-2026 సందడి మొదలైంది. లీగ్లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు ముంబైలో ఒకేచోట కలుసుకున్నారు. సీజన్ ప్రారంభానికి ముందు ఏటా జరిగే ‘కెప్టెన్స్ ఫొటోషూట్’లో వీరంతా పాల్గొన్నారు. హార్దిక్ పాండ్య, రుతురాజ్ గైక్వాడ్, రజత్, పంత్, కిషన్, రహానే, పరాగ్, అక్షర్, గిల్, శ్రేయస్ కలిసున్న ఫొటోలను IPL పంచుకుంది. ఈ నెల 28 నుంచి ఈ క్రికెట్ పండుగ షురూ కానున్న విషయం తెలిసిందే.
News March 25, 2026
ఫ్రూట్-ఫ్లేవర్డ్ బీర్లు ఇక రానట్లే

TG: రాష్ట్రంలో పండ్లు, ఇతర ఫ్లేవర్డ్ బీర్లను అందుబాటులోకి తెచ్చేందుకు GOVT గతంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటు కోసం టెండర్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ బ్రూవరీల ద్వారా ప్రతినెల ₹100CR ఆదాయాన్ని ఆర్జించవచ్చనుకుంది. HYDలో 100కు పైగా, ఇతర కార్పొరేషన్లలో20కి పైగా దరఖాస్తులు అందాయి. అయితే టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు లేకపోవడంతో దరఖాస్తులను తిరస్కరించింది.


