News April 24, 2025

అమీన్పూర్: తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈవో

image

సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి జూన్ 11 వరకు అన్ని రకాల పాఠశాలలకు వేసవి సెలవులు పాఠశాల విద్యాశాఖ ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. సెలవులలో ఎవరైనా పాఠశాలలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని అన్ని రకాల యజమాన్యాల ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.

Similar News

News April 25, 2025

రేపటి నుంచి భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు మొదలవుతాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. రేపటితో వడగాలులు ముగుస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని, ముఖ్యంగా 26న వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని వివరించారు.

News April 25, 2025

ఉగ్రదాడిని పాకిస్థాన్ ఒప్పుకున్నట్లేనా?

image

ఉగ్రదాడిలో PAK హస్తముందని ఆరోపిస్తూ IND ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు పాక్ తీరు తప్పును ఒప్పుకున్నట్లే ఉంది. దాడి చేయకపోతే, చేయలేదని చెప్పకుండా ప్రతీకార చర్యలకు దిగింది. సరిహద్దులకు సైన్యాన్ని పంపి యుద్ధానికి సై అంటోంది. IND ఆరోపణలు అవాస్తమైతే దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సింది పోయి PAK వ్యవహరిస్తున్న తీరు దోషినని ఒప్పుకున్నట్లుగానే ఉంది.

News April 24, 2025

మేడిగడ్డ బ్యారేజీపై సంచలన నివేదిక!

image

TG: మేడిగడ్డలోని బ్లాక్‌లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని NDSA నివేదిక పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధ్యయనం చేసిన కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేసింది. బ్యారేజీలలో నిర్వహణ లోపాలే సమస్యలు తెచ్చిపెట్టాయని తెలిపింది. మేడిగడ్డ బ్లాక్-7 ఎక్కువ దెబ్బతిందని, ప్రాజెక్ట్ వినియోగం ముప్పేనని తేల్చి చెప్పింది. నిర్మాణ లోపాలపై నిపుణుల పరిశీలన అవసరమని సూచించింది.

error: Content is protected !!