News April 24, 2025
తుపాకీ గురిపెట్టిన MBNR ఎమ్మెల్యే

ఏనుగొండలో మల్టీ స్పోర్ట్స్ ఏరియాను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫిస్టల్ షూటింగ్ గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ ఫిస్టల్ను ఎమ్మెల్యే తన చేతులతో ఎక్కుపెట్టి ఉత్సాహపరిచారు. అన్ని క్రీడలు ఒకే దగ్గర అందుబాటులో ఉంచడం పట్ల నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. పట్టణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 24, 2025
MBNR: 12 వందల ఏళ్ల క్రితం నాటి శివలింగం చరిత్ర ఇదే.!

దాదాపు 12 వందల ఏళ్ల క్రితం కాకతీయుల రాజప్రతినిధులు గోన గన్నారెడ్డి పరిపాలిస్తున్న కాలంలో అడ్డాకుల మండలం రాచాలలో వెలసిన దివ్యక్షేత్రం రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించబడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. స్వామివారి లింగం, ఆలయ నిర్మాణ శైలి సైతం కాకతీయుల నిర్మాణాలను పోలి ఉండటం, కందూరు గ్రామ శాసనాలలో ఆలయ ప్రస్తావన ఉండటం ఇందుకు సాక్ష్యంగా పరిశీలకులు పరిగణిస్తున్నారు.
News April 24, 2025
MBNR: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !

స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండకాలంలో సేద తీరేందుకు పిల్లలు, పెద్దలు కలిసి ఈతకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, నీటి ట్యాంకులు, కుంటల వద్ద ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈత సరదా మాటున ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.
News April 24, 2025
NGKL: ఇంటర్ విద్యార్థి సూసైడ్ !

తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన NGKL జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. తెల్కపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మార్కులు ముఖ్యం కాదని విద్యార్థులకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలని నిపుణులు చెబుతున్నారు.