News April 24, 2025
తమిళనాడులో మయోనీస్పై బ్యాన్

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గుడ్లతో తయారు చేసే మయోనీస్ను తమిళనాడు ప్రభుత్వం ఏడాది పాటు బ్యాన్ చేసింది. అలాగే దాన్ని హైరిస్క్ ఆహార పదార్థంగా ప్రకటించింది. అక్కడి ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. పచ్చి గుడ్డు, వెజిటెబుల్ ఆయిల్, వెనిగర్ తదితరాలతో మయోనీస్ తయారు చేస్తున్నట్లు పేర్కొంది. తయారీ, నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడంతో దాన్ని తిన్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు వివరించింది.
Similar News
News November 18, 2025
X(ట్విటర్) డౌన్

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT
News November 18, 2025
చలికి చర్మం పగులుతుందా?

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.
News November 18, 2025
పాడి పశువులకు మేత, దాణా ఇలా అందిస్తే మంచిది(1/2)

పాడి పశువులకు వరిగడ్డి, చొప్పలాంటి ఎండు మేతతో పాటు తప్పనిసరిగా పచ్చిమేత ఉండాలి. పశువు శరీర బరువు, పాల మోతాదును అనుసరించి మేత అందిస్తే దాని పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాడి పశువు ప్రతి 45 కిలోల శరీర బరువుకు 1-1.5 కిలోల ఎండు మేత, 3-5 కిలోల పచ్చిమేత తింటుంది. నాలుగు లీటర్ల లోపు పాలిచ్చే పశువులకు సాధారణంగా 4-5 కిలోల ఎండుగడ్డి, 1-1.5 కిలోల దాణా మిశ్రమం సరిపోతుంది. ఎక్కువగా ఇచ్చి వృథా చేయకూడదు.


