News April 24, 2025

పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో కోటవురట్ల మండలం

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23న విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో కోటవురట్ల మండలం అనకాపల్లి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఎంఈవోలు రామారావు, జోషి గురువారం తెలిపారు. మండలంలోని నాలుగు జడ్పీ హైస్కూల్స్‌ ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక కస్తూర్బా విద్యాలయం నుంచి 443 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 434 మంది ఉత్తీర్ణులు అయినట్లు పేర్కొన్నారు. 97.97 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.

Similar News

News April 15, 2026

భీమవరం: నేడే ఇంటర్మీడియట్ రిజల్ట్స్

image

ఇంటర్ ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్నాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ ఏడాది 53 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరంలో 19,662 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,888 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల తరువాత స్టూడెంట్స్ ఒత్తిడికి గురికాకుండా పేరెంట్స్ టీచర్స్ ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

News April 15, 2026

యుద్ధం.. 4 పాయింట్లతో చైనా పీస్ ప్లాన్!

image

ఇరాన్, US మరోసారి చర్చలకు యత్నిస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 4 పాయింట్లతో పీస్ ప్లాన్ సూచించారు. ‘పశ్చిమాసియా, గల్ఫ్‌లో సుస్థిర భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు దేశాలు బంధాలు మెరుగుపరుచుకోవాలి. దేశాల జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. ఐక్యరాజ్యసమితి కేంద్రంగా అంతర్జాతీయ వ్యవస్థను దృఢంగా నిలబెట్టాలి. అన్ని దేశాలు అభివృద్ధిని భద్రతతో అనుసంధానించాలి. ఇందుకు మేం సాయపడతాం’ అని పేర్కొన్నారు.

News April 15, 2026

SSS: జిల్లా వ్యాప్తంగా తనిఖీలు.. RMP క్లినిక్‌ల‌కు షోకాజ్ నోటీసులు

image

శ్రీ సత్యసాయి కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపి క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పెనుకొండ డివిజన్‌లో 2 క్లినిక్‌లు, కదిరి డివిజన్‌లో 2, పుట్టపర్తి డివిజన్‌లో 1 RMP క్లినిక్‌‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ లు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.