News April 24, 2025

90 శాతం సమస్యలు ఎమ్మార్వో వద్దనే పరిష్కారమవుతాయి: జనగామ కలెక్టర్

image

భూ భారతి చట్టంతో 90 శాతం వరకు సమస్యలు తహశీల్దార్ల వద్దనే పరిష్కారమవుతాయని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి ఆర్ఓఆర్ చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారానికి మంచి అవకాశం ఉన్న దృశ్యా ఈ చట్టంపై జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Similar News

News April 25, 2025

ఎనుమాముల మార్కెట్ వ్యాపారులు, రైతులకు ముఖ్య గమనిక

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్ వ్యాపారులకు, రైతులకు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున సరుకుల బీటు సమయాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. మిర్చి బీటు ఉ.7.05 ని.కు, పత్తి బీటు 8:05 ని.కు, పల్లికాయ ఉ.8:15 ని.కు, పసుపు బీటు 8:30కి, అపరాలు, ధాన్యం బీటు 8:45 ని.కు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 28 సోమవారం నుంచి 11-06-2025 బుధవారం వరకు ఈ బీటులో మార్పులుంటాయన్నారు.

News April 25, 2025

మద్దూరు: రెవెన్యూ సదస్సులు పరిశీలించిన కలెక్టర్

image

మద్దూరు మండలం భీమ్ పూర్, నాగంపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పరిశీలించారు. ఇప్పటివరకు రైతుల నుంచి అందిన అర్జీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. 

News April 25, 2025

ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

image

✒ 1874: రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త గూగ్లిల్మో మార్కోని జననం
✒ 1984: గణితశాస్త్రజ్ఞుడు ముదిగొండ విశ్వనాథం మరణం
✒ 2005: ఆధ్యాత్మిక గురువు స్వామి రంగనాథానంద మరణం(ఫొటోలో)
✒ 2005: గాయని, నటి టంగుటూరి సూర్యకుమారి మరణం
✒ 2018: రాజకీయ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి మరణం
✒ నేడు మలేరియా దినోత్సవం

error: Content is protected !!