News April 24, 2025

ఈనెల 26న మహబూబాబాద్‌లో జాబ్ మేళా

image

ఈనెల 26న మహబూబాబాద్ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లిప్ కార్ట్ సంస్థలో జిల్లాలో డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు టెన్త్, ఆ పైన విద్యార్హత కలిగిన పురుష అభ్యర్థులకు ఉద్యోగవకాశాలను కల్పించనున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్ఆర్ 8374054911కు సంప్రదించలన్నారు.

Similar News

News April 25, 2025

ASF: వడదెబ్బకు ఏడుగురి మృతి

image

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.

News April 25, 2025

రోజూ 40 రోటీలు తినేవాడిని: జైదీప్

image

తనకు 28 ఏళ్ల వయసు వచ్చే వరకు రోజూ 40 రోటీలు తిని, లీటరున్నర పాలు తాగేవాడినని ‘పాతాళ్‌లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ వెల్లడించారు. అయినా తాను 70KGల బరువు దాటలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక వయసు దాటాక తిండిలో మార్పులు చేసుకోవాలని, అప్పుడే జీవనశైలి బాగుంటుందని చెప్పారు. ఎక్కడ షూటింగ్ జరిగినా ఇప్పటికీ ఇంటి ఆహారమే తింటానన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు అందుబాటులో ఉన్నవాటితో సర్దుకుంటానని పేర్కొన్నారు.

News April 25, 2025

పైసా ఫీజు లేకుండా భూ పరిష్కారం: కలెక్టర్

image

భూ భారతి చట్టం-2025 ద్వారా రైతుల భూ సమస్య తీర్చడానికి ప్రభుత్వం ద్వారా ఒక పైసా వసూలు చేయబోమని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. డోర్నకల్‌లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. గత భూ చట్టాల్లో ప్రజలకు ఎదురైన అనేక ఇబ్బందులను సరిదిద్దుతూ, అన్ని విధాలుగా ఆలోచించి ఈ నూతన చట్టాన్ని రూపొందించారన్నారు.

error: Content is protected !!