News April 24, 2025
చంద్రమౌళి పార్థివదేహానికి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. విశాఖలోని కనకదుర్గ హాస్పిటల్కి వెళ్లి చంద్రమౌళి పార్థివ దేహాంపై పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడుల్లో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రపంచం మొత్తం ఈ దాడులను ఖండిస్తోందని పేర్కొన్నారు.
Similar News
News April 19, 2026
విశాఖ – భవానీపట్న రైలు రీషెడ్యూల్

ఇన్కమింగ్ రేక్ ఆలస్యం కావడంతో విశాఖ – భవానీపట్న ప్యాసింజర్ (58504) రైలు సమయాన్ని మార్చినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
News April 19, 2026
విశాఖ: చందనోత్సవం వేళ.. 185 వాటర్ స్టాల్స్

సింహాచలంలో స్వామివారికి జరుగబోయే చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో GVMC చేపడుతున్న ఏర్పాట్లను కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. భక్తుల కోసం 185 వాటర్ స్టాల్స్, 6000 బబుల్ వాటర్ క్యాన్లు, 40,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశామన్నారు. 1,860 శానిటరీ సిబ్బంది, 600 డస్ట్ బిన్లు, 20 వాటర్ ట్యాంకర్లతో పాటు 372 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
News April 18, 2026
సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో PGRS రద్దు

సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో జరగాల్సిన PGRS రద్దు చేస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం తెలిపారు. సోమవారం సింహాచలం చందనోత్సవ నేపథ్యంలో పోలీస్ అధికారులందరూ బందోబస్తు విధులు నిర్వహించనున్నందున ఆరోజు పోలీస్ ఉన్నత అధికారులు అందుబాటులో ఉండరని తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


