News April 25, 2025
సింధు జలాల ఒప్పందం రద్దు.. పాక్కు తేల్చిచెప్పిన భారత్

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. తక్షణమే జల ఒప్పందం రద్దు అమల్లోకి వస్తుందని తెలియజేస్తూ జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాక్కు లేఖ రాశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహించడమే కారణమని పేర్కొన్నారు. అగ్రిమెంట్లో భాగంగా సంప్రదింపులకు విజ్ఞప్తిని పలుమార్లు పాక్ తిరస్కరించిందని గుర్తు చేశారు.
Similar News
News January 22, 2026
ఖమ్మం: ఎన్నికల నగారా.. మున్సిపాలిటీలపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్!

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లిలలో ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల తనిఖీ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.
News January 22, 2026
ఖమ్మం: ఎన్నికల నగారా.. మున్సిపాలిటీలపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్!

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లిలలో ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల తనిఖీ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.
News January 22, 2026
కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

పరిగి మండలం కోడిగినహళ్లి కేజీబీవీ అంధుల పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బుధవారం సందర్శించారు. ఆహార పదార్థాల నిల్వలను తనిఖీ చేసిన ఆయన, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్లో మెరుగైన శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.


