News March 28, 2024

గూడూరు: రైలు కిందపడి ఆత్మహత్య?

image

నాయుడుపేట-పెద్దపరియ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి చనిపోవడాన్ని గూడూరు రైల్వే పోలీసులు గుర్తించారు. రైల్వే ఎస్ఐ కొండప్ప నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి రైలు వస్తుండగా పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. మృతుడు గళ్ల లుంగి, ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని గూడూరు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 6, 2026

జగన్‌ని తిడితేనే MLAలకు ర్యాంకులు: కాకాణి

image

జగన్‌ని తిడితేనే ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ పెరిగేలా చంద్రబాబు టార్గెట్ పెట్టారని మాజీ మంత్రి కాకాణి విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘మావిగన్ చర్చను అడ్డుకోవడానికి ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. రూ.కోట్లు ఖర్చు చేసి జగన్‌పై ట్రోలింగ్ చేయిస్తున్నారు. రాజకీయ విమర్శల పేరుతో ABN రాధాకృష్ణ మహిళలను అవమానించడం దారుణం. చంద్రబాబు ఆదేశాలతోనే ఇలా చేస్తున్నారు’ అని కాకాణి ఫైరయ్యారు.

News April 6, 2026

ఉదయగిరి MLAపై మంత్రికి మహిళ ఫిర్యాదు!

image

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌పై వెంగమాంబ అనే మహిళ ఇటీవల వరుస ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్ పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌ను ఆమె కలిశారు. ఉదయగిరిలో ఇటీవల జరిగిన పరిణామాలను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. వింజమూరుకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు ఆయనను కలవనీయకుండా పోలీసులు తనను అడ్డుకోవడంలో ఎమ్మెల్యే పాత్ర ఉందని లోకేశ్‌కు చెప్పినట్లు సమాచారం.

News April 6, 2026

నెల్లూరు జిల్లాలో ధరల పెంపు

image

నెల్లూరు జిల్లాలో విజయ డెయిరీ పాల సేకరణ ధరలు పెరిగాయి. నేటి నుంచే అమలు చేస్తున్నామని డెయిరీ ఛైర్మన్ వెంకట ప్రసాద్ వెల్లడించారు. గేదె పాలకు కేజీ వెన్న శాతం గతంలో రూ.800 ఉండగా రూ.820కి పెంచామని చెప్పారు. రైతులకు లీటరు పాలపై అదనంగా రూ.1.28 అందుతుందన్నారు. ఆవు పాలకు గతంలో రూ.265 ఉండగా ఇప్పుడు రూ.290 చేశామని.. లీటరు ఆవు పాలపై రైతుకు అదనంగా రూ.3 చెల్లిస్తామని చెప్పారు.