News April 25, 2025
కడప: మోదీ అంటే ఏంటో పాకిస్తాన్కి తెలుస్తుంది: ఎమ్మెల్యే

కడప జిల్లా యర్రగుంట్ల మండలంలో MLA ఆదినారాయణరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పాకిస్థాన్ పైన తీవ్రమైన చర్య ఉంటుందని ప్రపంచం మొత్తం బారత్కు మద్దతు ఇస్తోందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు అయినప్పటి నుంచి 3 కోట్లకు పైగా కశ్మీర్లో పర్యాటకులు సందర్శించారన్నారు. 22 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్కు అంత ఉంటే 140 కోట్లు ఉన్న మనం ఏంటో ఆర్మీ శక్తి, ప్రధాని మోదీ అంటే ఏంటో పాకిస్థాన్కు తెలుస్తుందన్నారు.
Similar News
News April 25, 2025
లింగాల: పడిపోయిన అరటికాయల ధరలు.. ఆవేదనలో రైతులు

అరటి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల బలమైన ఈదురుగాలులకు అరటి గెలులతో ఉన్న చెట్లు పడిపోగా.. ప్రస్తుతం అరటికాయల ధరలు పడిపోయాయి. అరటి రైతుల పరిస్థితి ‘గోరుచుట్టుపై రోకలి పోటు’ అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం టన్ను అరటికాయల ధరలు నాలుగైదు వేలు పలుకుతున్నాయి. అరటి కాయలను ఉన్న ధరలకు అమ్ముదామనుకుంటే వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్థులు ముందుకు రావడంలేదు.
News April 25, 2025
అన్నమయ్య: పది పరీక్షలో ఫెయిల్.. ఇద్దరు విద్యార్థులు మృతి

అన్నమయ్య జిల్లాలో రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. పది పరీక్షలో పెయిల్ అయ్యానని ములకలచెరువు మండలం పెద్దమోరవ పల్లికి చెందిన నవనీ (15) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. అలాగే గుర్రంకొండకు చెందిన విష్ణు వరుసగా మూడు సార్లు పది పరీక్షలు రాశాడు. అయినా ఫెయిల్ అవుతుండటంతో మనస్థాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలతో అన్నమయ్య జిల్లా ఉలిక్కి పడింది.
News April 24, 2025
కడప: ‘గర్భిణులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది’

గర్భిణులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని కడప ఐసీడీఎస్ పీడీ శ్రీ లక్ష్మీ పేర్కొన్నారు. గురువారం కడప కలెక్టరేట్ సభా భవనంలో కడప, అన్నమయ్య జిల్లాల ఐసీడీఎస్ అధికారులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మాతృవందన పథకంలో గర్భం దాల్చిన 9నెలలలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండు విడుతలగా ఆర్థిక సాయం అందుతుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.