News March 28, 2024
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ రవాణా కట్టడి చేయాలి: సీపీ

అంతర్ రాష్ట్ర సరిహద్దు పోలీసుల సమిష్టి కృషి, సమాచార మార్పిడితో ఫ్రీ & ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాలని సీపీ సునీల్ దత్, ఏలూరు ఎస్పీ మేరి ప్రశాంతి అన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాలో అక్రమ రవాణా, చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖమ్మం, ఏలూరు జిల్లాల పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు.
Similar News
News April 6, 2026
రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మంగళవారం మార్కెట్ కమిటీ సభ్యులు సెలవు ప్రకటించారు. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మిర్చి శాఖ కార్యదర్శి సతీష్ కుమార్ సతీమణి అకాల మృతికి చింతిస్తూ మిర్చి శాఖ సభ్యుల కోరిక మేరకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. తిరిగి ఈనెల 8వ తేదీ బుధవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించారని పేర్కొన్నారు.
News April 6, 2026
ముదిగొండ: నేడు ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి నేడు ముదిగొండ మండలంలో పర్యటించనున్నారు. ఎంపీ నిధులతో న్యూ లక్ష్మీపురం, పమ్మి, వల్లభి తదితర గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, బోర్లను ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి జరిగే ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
News April 6, 2026
ఖమ్మం: గాలివాన వచ్చినా విద్యుత్ ఆగదు!

ఖమ్మం జిల్లాలో వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు 5 ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్స్ను రంగంలోకి దించారు. ఐటీఐ నిపుణులతో కూడిన ఈ బృందాలు ఖమ్మం, మధిర, సత్తుపల్లిలో అందుబాటులో ఉంటాయి. వీరికి ప్రత్యేక వాహనాలు, పనిముట్లు అందించారు. సమస్య తలెత్తితే వెంటనే 1912 నంబర్కు ఫిర్యాదు చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.


