News April 25, 2025
వనపర్తి: విషపూరిత ద్రవం తాగి చిన్నారి మృతి

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలోని 9వ వార్డులో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీకి చెందిన వంశీ, గాయత్రి దంపతులకు ఆర్థిక(18 నెలలు), మణికంఠ పిల్లలు ఉన్నారు. సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఆర్థిక ఓ బాటిల్లో ఉన్న ద్రవాన్ని తాగింది. దీంతో చిన్నారి మృతిచెందింది. మణికంఠ కళ్లమీద ద్రవం పడటంతో బొబ్బలు వచ్చాయి. మణికంఠను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ ద్రవం ఏంటో తెలియరాలేదు.
Similar News
News January 15, 2026
సంక్రాంతికి విడుదల.. ఏ సినిమాకు వెళ్లారు?

సంక్రాంతి అనగానే సినిమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. పండగ వేళ ఇంటిల్లిపాదీ సినిమాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి 5 సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ‘రాజాసాబ్’, చిరంజీవి ‘MSVPG’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ జాబితాలో ఉన్నాయి. మీరు వీటిలో ఏ సినిమాకు వెళ్లారు? ఏ మూవీ నచ్చింది?
News January 15, 2026
ఖమ్మం: మిస్సింగ్ యువకుడు సేఫ్

ఖమ్మంలోని ప్రకాష్ నగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి దిలీప్ కుమార్ అదృశ్యం సుఖాంతమైంది.‘వే2న్యూస్’లో వచ్చిన వార్తకు స్పందించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు, స్థానికులు దిలీప్ ఆచూకీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. త్రీ టౌన్ పోలీసులు బాధితుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కుమారుడిని సురక్షితంగా అప్పగించడంలో సహకరించిన వే2న్యూస్, అధికారులకు దిలీప్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
News January 15, 2026
శ్రీకాళహస్తిలో గిరిప్రదక్షిణకు ముందు ఏం చేస్తారంటే..?

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తరఫున సద్యోమూర్తి పల్లకిసేవ ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందు రోజున సద్యోమూర్తి పల్లకి సేవ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఫిబ్రవరి నెలలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కైలాసగిరి పర్వతాలపై ఉన్న ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు స్వామి, అమ్మవార్ల గిరిప్రదక్షిణ జరుగుతుంది.


