News April 25, 2025

ఎన్టీఆర్: పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి.. 3ఏళ్ల కఠిన కారాగార శిక్ష 

image

మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన డేవిడ్ పవన్ కుమార్(37) అనే వ్యక్తిపై కృష్ణలంక పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విజయవాడ పోస్కో కోర్ట్ జడ్జి వి.భవాని గురువారం విచారించారు. డేవిడ్ పవన్ కుమార్ నేరం చేసినట్లు రుజువైనందున నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. 

Similar News

News April 18, 2026

కామారెడ్డి: డ్రంకెన్ డ్రైవ్.. 68 మందికి శిక్షలు

image

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 68 మందికి కోర్టు శిక్షలు విధించింది. ఇందులో 12 మందికి జైలు శిక్ష పడగా మొత్తం ₹82,700 జరిమానా విధించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రాణాంతకమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

News April 18, 2026

కామారెడ్డి: డ్రంకెన్ డ్రైవ్.. 68 మందికి శిక్షలు

image

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 68 మందికి కోర్టు శిక్షలు విధించింది. ఇందులో 12 మందికి జైలు శిక్ష పడగా మొత్తం ₹82,700 జరిమానా విధించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రాణాంతకమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

News April 18, 2026

అణు కార్యక్రమాన్ని ఇరాన్ ఆపేస్తుంది: ట్రంప్

image

ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. తాము స్తంభింపజేసిన నిధులను ఆ దేశానికి ఇవ్వబోమని స్పష్టంచేశారు. ‘యురేనియం శుద్ధిని ఆపేస్తామని ఇరాన్ తెలిపింది. రెండు దేశాల మధ్య చాలా కీలక అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయి. చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ వారాంతంలోనే శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి’ అని ఫోన్ ఇంటర్వ్యూలో తెలిపారు.