News April 25, 2025
పెద్దపల్లిలో పహల్గం మృతులకు జర్నలిస్టుల నివాళులు

పహల్గం ఘటనలో మృతిచెందిన భారతీయులకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద జర్నలిస్టులు గురువారం రాత్రి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దేశ భద్రతతో రాజీపడకుండా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శత్రుదేశం వెన్నులో వణుకు పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News January 16, 2026
పాల్వంచ: కొత్త అల్లుడికి ‘271’ వంటకాలతో విందు

కొత్త అల్లుడిపై అత్తమామలు తమ మమకారాన్ని వినూత్నంగా చాటుకున్నారు. సంక్రాంతి సందర్భంగా పాల్వంచలోని హైస్కూల్ రోడ్డుకు చెందిన గర్రె శ్రీనివాసరావు-పారిజాతం దంపతులు తమ అల్లుడు దత్త రామకృష్ణ, కుమార్తె ప్రణీతలకు ఏకంగా 271 రకాల పిండి వంటలు, స్వీట్లతో భారీ విందు ఏర్పాటు చేశారు. ఆంధ్ర సంప్రదాయాన్ని తలపించేలా తెలంగాణలోనూ ఇంత పెద్ద ఎత్తున వంటకాలు సిద్ధం చేయడంతో ఈ విందు స్థానికంగా చర్చనీయాంశమైంది.
News January 16, 2026
కాకినాడ: ‘కుక్కుట శాస్త్రం’ చెప్పిందే నిజమవుతోందా?

జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న కోడిపందేల్లో ‘కుక్కుట శాస్త్రం'(కోడి పురాణం) కీలకంగా మారింది. ఏ సమయంలో ఏ రంగు కోడి గెలుస్తుందో శాస్త్రంలో చెప్పినట్లే ఫలితాలు వస్తుండటంతో పందెంరాయుళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు ఇష్టారాజ్యంగా పందేలు కాస్తున్నా, భారీగా బెట్టింగులు కట్టే వారు మాత్రం నక్షత్ర బలం, తిథి చూసుకొని బరిలోకి దిగుతున్నారు. దీనికి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ పెరిగింది.
News January 16, 2026
HYD: రోడ్డుపై బండి ఆగిందా? కాల్ చేయండి

HYD- విజయవాడ హైవే పై వెళ్తుంటే మీ బండి ఆగిపోయిందా? వెంటనే 1033కి కాల్ చేయండి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది మీ వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తారు. పెట్రోల్, డీజిల్ అయిపోతే అందజేస్తారు. దానికి తగిన ధర చెల్లించాలి. టైర్పంచర్ అయితే ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ సేవలు 24Hrs అందుబాటులో ఉంటాయి. కుటుంబంతో హ్యాపీగా వెళ్తుంటే కార్ ఆగిపోతే ఆ బాధ వర్ణణాతీతం. అందుకే ఈ నం. సేవ్ చేసుకోండి.. అవసరమవుతుంది.
# SHARE IT


