News April 25, 2025
HYD: మూసీ ప్రాజెక్ట్.. భూ పరీక్షలకు బిడ్లు ఆహ్వానం

మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూసీ ప్రాజెక్టు అభివృద్ధిపై చక చకా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే మీర్అలం ట్యాంకు వద్ద భూ పరీక్షలు నిర్వహించేందుకు బిడ్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. మూసీకి ఆనుకుని ఉన్న భూమి పరిస్థితి, భూబలం, ఇతర సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఈ పరీక్షలు తోడ్పడనున్నాయి.
Similar News
News December 31, 2025
ఆసిఫాబాద్ ఎక్సైజ్ అధికారుల సూచన

డిసెంబర్ 31 సంబరాల్లో మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. ఈవెంట్స్ నిర్వహించే వారు ఎక్సైజ్ శాఖ అనుమతి పత్రం పొందాలని, అనుమతి లేని చోట మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం విక్రయాల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు వివరించారు.
News December 31, 2025
సంగారెడ్డి: కొత్త సంవత్సరం వేళ లింక్స్ ఓపెన్ చేయొద్దు

కొత్త సంవత్సరం పురస్కరించుకొని అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్లకు వచ్చే లింక్లను ఓపెన్ చేయొద్దని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. వాట్సప్ గ్రూపుల్లో వచ్చే న్యూ ఇయర్ లింకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కలర్ ఫల్ గ్రీటింగ్స్ అంటూ మార్వెల్ లింక్స్ పంపిస్తారని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్కి ఫోన్ చేయాలన్నారు.
News December 31, 2025
మార్టిన్కి సోకిన మెనింజైటిస్ వ్యాధి ఇదే!

AUS మాజీ క్రికెటర్ డామీన్ <<18720461>>మార్టిన్<<>> మెనింజైటిస్ వ్యాధి కారణంగా కోమాలోకి వెళ్లారు. మెదడు- వెన్నెముకను కప్పి ఉంచే రక్షణ పొరలకు సోకే ప్రమాదకరమైన ఇన్ఫెక్షనే మెనింజైటిస్. ఇది మెదడును దెబ్బతీస్తుంది. వ్యాధి సోకినవారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించి యాంటీబయాటిక్స్ తీసుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.


