News March 29, 2024

కొండబిట్రగుంట: రూ.16.39 లక్షల ఆదాయం

image

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇటీవల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో గురువారం స్వామివార్ల హుండీ కానుకలను లెక్కించారు. ఈక్రమంలో రూ.16,39,801 ఆదాయం వచ్చిందని ఈవో రాధా కృష్ణ తెలిపారు. ఇది గతేడాది కంటే ఎక్కువ అని చెప్పారు.

Similar News

News April 1, 2026

నెల్లూరులో అధికారులకు మటన్ బిర్యానీ.. ట్విస్ట్ ఇదే

image

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు మటన్ బిర్యానీ, చికెన్ పులుసు, చేప ఫ్రై పెట్టారు. మీటింగ్‌ వేళ ఇలా ఫుడ్ పెట్టడం సాధారణమే. కానీ నిన్న మహావీర్ జయంతి. నగరంలో ఎక్కడా మాంసం విక్రయించకూడదని అధికారులు ఆదేశాలు జారీచేశారు. కానీ మీటింగ్ తర్వాత అధికారులే నాన్ వెజ్ భోజనాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

News April 1, 2026

నేటి నుంచి 23 వరకు ఇంటర్ సెకండియర్ తరగతులు

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోగల జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులను నేటి నుంచి 23 వరకు నిర్వహించాలని RIO వరప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు కండక్ట్ చేయాలని సూచించారు. అనంతరం మే30 వరకు వేసవి సెలవులుంటాయని వివరించారు. ఈ విషయాన్ని కళాశాల సిబ్బంది, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.

News April 1, 2026

నెల్లూరు జిల్లాకు CM.. వీటిపై ఏమంటారో?

image

ప్రభుత్వాలు మారినా ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి జాడే లేదని స్థానికులు అంటున్నారు. వింజమూరులో బుధవారం CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి కోసం గతంలో ఏర్పాటు చేసిన సుజల స్రవంతి వాటర్ ఫ్లాంట్లు, 14 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న గండిపాలెం రిజర్వాయర్‌పై ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వింజమూరు సమ్మర్ స్టోరేజ్ నేటికీ కార్యరూపం దాల్చలేదు. వీటిపై CM ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.