News March 29, 2024
కొండబిట్రగుంట: రూ.16.39 లక్షల ఆదాయం

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇటీవల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో గురువారం స్వామివార్ల హుండీ కానుకలను లెక్కించారు. ఈక్రమంలో రూ.16,39,801 ఆదాయం వచ్చిందని ఈవో రాధా కృష్ణ తెలిపారు. ఇది గతేడాది కంటే ఎక్కువ అని చెప్పారు.
Similar News
News October 27, 2025
నెల్లూరు SP కార్యాలయం నుంచి కీలక అప్డేట్.!

ప్రతి సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు నెల్లూరు SP అజిత తెలిపారు. మోంతా తుఫాన్ కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బాదితులు ఎవ్వరూ జిల్లా కేంద్రానికి రావొద్దని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
News October 26, 2025
నెల్లూరు జిల్లాలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు పడునున్న నేపథ్యంలో రేపు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. అంతే కాకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి RIO వర ప్రసాదరావు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు కూడా రేపు సెలవు ప్రకటించారు.
News October 26, 2025
నెల్లూరు: గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి సర్వే

నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా ఆదేశాలతో మనుబోలు మండలం- పల్లిపాలెం గ్రామంలో గిరిజనుల ఇళ్ల నిర్మాణం కోసం ఆదివారం హౌసింగ్ అధికారులు సర్వే నిర్వహించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు తమకు ఇల్లు లేవని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సర్వేచేసి అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని హౌసింగ్ ఏఈ శరత్బాబు తెలిపారు.


