News March 29, 2024

నేడు జిల్లాకు ఎంపీ రఘురామకృష్ణరాజు

image

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు జిల్లాకు రానున్నట్లు ఎంపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన పెదఅమిరంలో ఉన్న ఆయన కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు, ఆయన అభిమానులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.

Similar News

News October 4, 2024

ప.గో: నేడు ట్రైకార్ ఛైర్మన్‌గా ప్రమాణం చేయనున్న శ్రీనివాసులు

image

పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం ఇంఛార్జ్ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు శుక్రవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కావున మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, హాజరు కావాల్సిందిగా అధికారులు వెల్లడించారు.

News October 3, 2024

ప.గో.జిల్లాలో వైసీపీ కనుమరుగైంది: మేకా శేషుబాబు

image

పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ కనుమరుగైందని వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆరోపించారు. గురువారం పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కనుమరుగవడానికి కారణం కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు అని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అలాగే గౌడలకు 10శాతం మద్యం షాపులు కేటాయించడం శుభ పరిణామన్నారు.

News October 3, 2024

పాలకోడేరు: నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ నయీం అస్మి

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జూమ్ మీట్ ద్వారా నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, అరెస్టులు, దర్యాప్తులపై ఆరా తీశారు. అలాగే దసరా, దీపావళికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.