News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 16, 2026
జగన్.. ఇదేం రాక్షస మనస్తత్వం: లోకేశ్

AP: YCP చీఫ్ జగన్పై మంత్రి లోకేశ్ X వేదికగా విరుచుకుపడ్డారు. ‘తల్లిని, చెల్లిని తరిమేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రప్పా.. రప్పా నరుకుతాం. అమరావతిని మార్చేస్తాం. కట్టినవన్నీ కూల్చేస్తాం అంటారు. ఎందుకీ దుర్మార్గం? అధునాతన బోట్ల తయారీ కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తానంటారా. ఇదేం రాక్షసమనస్తత్వం? వెయ్యికిపైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోవడం సైకోయిజమే’ అని దుయ్యబట్టారు.
News April 16, 2026
జగిత్యాల: కేసీఆర్ మహాసభ ఏర్పాట్ల పర్యవేక్షణ

ఈనెల 20న జగిత్యాల మినీ స్టేడియంలో జరుగనున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మహాసభ ఏర్పాట్లను జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పర్యవేక్షిస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులతో సమన్వయం చేస్తూ, అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా కృషి చేస్తున్నారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.
News April 16, 2026
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి: కలెక్టర్

ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఎర్రవల్లి ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో మహేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హాజరయ్యారు. మండలంలో చేసిన కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులున్నారు.


