News March 29, 2024
‘డ్రగ్స్’తో మా కుటుంబానికి సంబంధం లేదు: పురందీశ్వరి
AP: వైజాగ్లో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్తో తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి తెలిపారు. ‘వైఎస్ జగన్ ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో నాపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల్ని ఇలాంటి వ్యాఖ్యలతో మభ్యపెట్టకుండా వారికి మీరేం చేశారో చెప్పండి. ఈ తరహా దుష్ప్రచారాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News October 5, 2024
అబుదాబిలో ఎంజాయ్ చేస్తోన్న హిట్మ్యాన్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అబుదాబిలో ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య రితికా సజ్దేహ్తో కలిసి ఆయన NBA టోర్నీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా వుమెన్స్ టీ20 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా ప్లేయర్లను మోటివేట్ చేసేందుకు ఆయన దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
News October 5, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 5, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:07 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:07 గంటలకు
అసర్: సాయంత్రం 4:23 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:02 గంటలకు
ఇష: రాత్రి 7.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 5, 2024
‘RG కర్’ మృతురాలి ఫొటో వెల్లడించిన వారికి నోటీసులు
కోల్కతాలోని RG కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మృతురాలి వివరాలను, ఫొటోను సోషల్ మీడియాలో పలువురు వెల్లడించారు. అలాంటి 25మందిని కోల్కతా పోలీసులు గుర్తించి నోటీసులు పంపించినట్లు సమాచారం. వీటిలో కొన్ని బంగ్లాదేశ్ నుంచి కూడా నడుస్తున్నాయని తెలుస్తోంది. ఐపీ అడ్రెస్ ఆధారంగా వాటిని ట్రేస్ చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.