News March 29, 2024
10 సీట్లు కొట్టాల్సిందేనంటున్న కమలం పార్టీ
తెలంగాణలో కచ్చితంగా 10 ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటు బ్యాంక్ భారీగా పెరిగినట్లు భావిస్తోంది. పక్కాగా 10 సీట్లు, 35% ఓట్లు వచ్చే విధంగా పని చేయాలని అగ్రనాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ చరిష్మాతో పాటు అయోధ్య రామమందిరం బాగా కలిసొస్తాయని కమలం పార్టీ అంచనా వేస్తోంది.
Similar News
News October 5, 2024
అబుదాబిలో ఎంజాయ్ చేస్తోన్న హిట్మ్యాన్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అబుదాబిలో ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య రితికా సజ్దేహ్తో కలిసి ఆయన NBA టోర్నీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా వుమెన్స్ టీ20 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా ప్లేయర్లను మోటివేట్ చేసేందుకు ఆయన దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
News October 5, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 5, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:07 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:07 గంటలకు
అసర్: సాయంత్రం 4:23 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:02 గంటలకు
ఇష: రాత్రి 7.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 5, 2024
‘RG కర్’ మృతురాలి ఫొటో వెల్లడించిన వారికి నోటీసులు
కోల్కతాలోని RG కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మృతురాలి వివరాలను, ఫొటోను సోషల్ మీడియాలో పలువురు వెల్లడించారు. అలాంటి 25మందిని కోల్కతా పోలీసులు గుర్తించి నోటీసులు పంపించినట్లు సమాచారం. వీటిలో కొన్ని బంగ్లాదేశ్ నుంచి కూడా నడుస్తున్నాయని తెలుస్తోంది. ఐపీ అడ్రెస్ ఆధారంగా వాటిని ట్రేస్ చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.