News March 29, 2024
నేడు జనసేన అభ్యర్థుల ప్రకటన?

అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు, బందరు ఎంపీ సీటుకు అభ్యర్థుల్ని జనసేన అనౌన్స్ చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై 4 రోజుల నుంచి పవన్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా సీట్ల ఆశావహులు ఆయనతో పార్టీ కార్యాయలంలో భేటీ అయ్యారు. నేడు మరోసారి పార్టీ కార్యవర్గంతో చర్చించిన అనంతరం జనసేనాని జాబితా అనౌన్స్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News March 25, 2026
ఆ ఫుడ్స్ తింటే తండ్రయ్యే ఛాన్స్ తక్కువట!

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటే పురుషుల్లో సంతానలేమి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నెదర్లాండ్స్లోని ఎరాస్మస్ వర్సిటీ స్టడీలో తేలింది. చిప్స్, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ లాంటివి అధికంగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ టైమ్ పడుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. అటు మహిళల్లో ఈ ఫుడ్ వల్ల గర్భంలో పిండం ఎదుగుదల నెమ్మదిస్తుందని ఈ సర్వే హెచ్చరించింది.
News March 25, 2026
చిన్న నియోజకవర్గం.. గొప్ప అభివృద్ధి

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్సభ స్థానాలు పెరుగుతాయి. దీనివల్ల ఒక్కో MP పరిధిలోని జనాభా 30 లక్షల నుంచి 15 లక్షలకు తగ్గుతుంది. చిన్న నియోజకవర్గాల వల్ల MPలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తారు. ఫలితంగా స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు MP నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. ఈ మార్పు క్షేత్రస్థాయి అభివృద్ధికి, యువ నాయకత్వం రాజకీయాల్లోకి రావడానికి అవకాశంగా నిలుస్తుంది.
News March 25, 2026
అమెరికా-ఇరాన్ మధ్య పాక్.. వ్యూహమా? స్వార్థమా?

US, ఇరాన్ మధ్య గొడవను ఆపేందుకు పాక్ ఇప్పుడు మధ్యవర్తిగా మారుతోంది. దీని వెనుక శాంతి కంటే స్వార్థమే ఎక్కువ కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాలేక గల్ఫ్ దేశాల సపోర్ట్ కోసం ఇలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఇండియా ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించాలనే వ్యూహమూ కనిపిస్తోందంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డైరెక్షన్లో జరుగుతున్న ఈ టాక్టిక్స్కు ఇరాన్ ఇంకా ఓకే చెప్పలేదు.


